Kiara Advani : సౌత్, నార్త్లో దుమ్ము రేపుతున్న అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడికి ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన కియారా అద్వానీ కబీర్ సింగ్ అనే ఒక్క మూవీతో బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. స్టార్ హీరోయిన్ స్టేటస్కి చేరుకుంది. గతంలో రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో స్క్రీన్ షేర్ చేసుకుంది కియారా. అది హిట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అతనితో కలిసి ఓ సినిమా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
కియారా కొద్ది రోజులుగా సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా లవ్లో ఉన్న కియారా తన బాయ్ఫ్రెండ్కు బ్రేకప్ చెప్పినట్టు వస్తున్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. వీరి బ్రేకప్పై బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నా తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ జంట. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ అది గొడవల వల్ల కాదని, షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల.. అంటూ.. అందరినీ ఆలోచనలో పడేశారు ఈ జంట మ్యూచువల్ ఫ్రెండ్స్. తాజాగా తమ బ్రేకప్ వార్తలపై కియారా అద్వానీ స్పందించింది.
తాజాగా జరిగిన భూల్ భూలయ్యా 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయ్ంపై ఇన్డైరెక్ట్గా ప్రశ్న వేశాడు ఓ జర్నలిస్ట్. మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా ? అని అడగగా, దీనికి కియారా కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ప్రతి ఒక్కరు నా జీవితంలో ఇంపార్టెంట్. ఎవరినీ మరచిపోవాలని అనుకోవట్లేదు.. అంటూ బదులిచ్చింది. ఇదిలా ఉండగా ఇద్దరూ కలిసి పార్టీల్లో చెట్టాపట్టాలేసుకు తిరగడం, హలీడే వెకేషన్కు వెళ్లడం, బర్త్ డే వేడుకల్లో ఎంజాయ్ చేస్తుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…