Kiara Advani : సౌత్, నార్త్లో దుమ్ము రేపుతున్న అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడికి ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన కియారా అద్వానీ కబీర్ సింగ్ అనే ఒక్క మూవీతో బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. స్టార్ హీరోయిన్ స్టేటస్కి చేరుకుంది. గతంలో రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో స్క్రీన్ షేర్ చేసుకుంది కియారా. అది హిట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అతనితో కలిసి ఓ సినిమా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
కియారా కొద్ది రోజులుగా సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా లవ్లో ఉన్న కియారా తన బాయ్ఫ్రెండ్కు బ్రేకప్ చెప్పినట్టు వస్తున్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. వీరి బ్రేకప్పై బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నా తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ జంట. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ అది గొడవల వల్ల కాదని, షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల.. అంటూ.. అందరినీ ఆలోచనలో పడేశారు ఈ జంట మ్యూచువల్ ఫ్రెండ్స్. తాజాగా తమ బ్రేకప్ వార్తలపై కియారా అద్వానీ స్పందించింది.
తాజాగా జరిగిన భూల్ భూలయ్యా 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయ్ంపై ఇన్డైరెక్ట్గా ప్రశ్న వేశాడు ఓ జర్నలిస్ట్. మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా ? అని అడగగా, దీనికి కియారా కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ప్రతి ఒక్కరు నా జీవితంలో ఇంపార్టెంట్. ఎవరినీ మరచిపోవాలని అనుకోవట్లేదు.. అంటూ బదులిచ్చింది. ఇదిలా ఉండగా ఇద్దరూ కలిసి పార్టీల్లో చెట్టాపట్టాలేసుకు తిరగడం, హలీడే వెకేషన్కు వెళ్లడం, బర్త్ డే వేడుకల్లో ఎంజాయ్ చేస్తుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…