Naga Chaitanya : ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్గా అందరి దృష్టినీ ఆకర్షించిన నాగ చైతన్య-సమంత గత ఏడాది అక్టోబర్ 2న విడిపోయిన సంగతి తెలిసిందే. వారు విడిపోయి చాన్నాళ్లే అవుతున్నా కూడా వారికి సంబంధించిన విషయాలు నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. సమంత అయితే నాగ చైతన్య ఙ్ఞాపకాలను కూడా చెరిపేస్తూ సోషల్ మీడియాలో అతని ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్న సమంత చైతూకి మాత్రం దూరంగా ఉంటోంది.
ఇక చైతూ కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నాడు. గురువారం సమంత 35వ బర్త్ డే కాగా.. చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ చైతూ మాత్రం సమంత గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. కాకపోతే ఆమె బర్త్ డే రోజు తాను నటించిన దూత వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గురువారం జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో తన సిరీస్ టైటిల్తోపాటు నాగచైతన్య లుక్ను విడుదలచేశారు. ఈ సిరీస్కు దూత అనే టైటిల్ను ఖరారు చేశారు. ఫస్ట్లుక్లో పాతకాలం నాటి కళ్లద్దాలు ధరించి సీరియస్ లుక్లో నాగచైతన్య కనిపిస్తున్నాడు.
చైతన్య ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అతీంద్రియ శక్తులతో అమాయకుల జీవితాల్ని నాశనం చేసే వారిని ఎదుర్కొనే యువకుడిగా పవర్ఫుల్ గా అతడి పాత్ర సాగుతుందని సమాచారం. ఈ సిరీస్ లో మళయాళ టాలెంటెడ్ నటి ప్రియా భవాని శంకర్, పార్వతిలు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక వీరంతా కలిసి ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో నాగ చైతన్య ప్రస్తుతం థాంక్ యూ సినిమాతో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్లో కూడా అడుగు పెట్టబోతున్నాడు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…