Karate Kalyani : నటి కరాటే కల్యాణి ఈ మధ్య తరచూ వార్తల్లో నిలిచిన విషయం విదితమే. ఈమె శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ను ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడనే కారణంతో రాత్రిపూట అతని ఇంటికి వెళ్లి మరీ కొట్టింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఈ కేసు ఇంకో టర్న్ తీసుకుంది. కరాటే కల్యాణి ఎలాంటి పత్రాలను లేకుండానే ఓ పాపను దత్తత తీసుకుందని కేసు నమోదు అయింది. దీంతో విచారణ జరిగింది. అయితే పాప తల్లిదండ్రులే తమకు స్థోమత లేక పెంచేందుకు ఆమెకు ఇచ్చామని చెప్పారు. దీంతో అధికారులు ఆమెకు అన్ని పత్రాలతోనే దత్తత తీసుకోవాలని చెప్పారు. దీంతో ఆ కేసులో కల్యాణికి క్లీన్ చిట్ లభించింది. అయితే కల్యాణి ఇప్పుడు ప్రాంక్ వీడియోలు చేసే యూట్యూబ్ చానల్స్పై పడింది. ఆమె ఆ చానల్స్ భరతం పట్టేందుకు నడుం బిగించింది.
ప్రాంక్ వీడియోల పేరిట యూట్యూబ్లో వీడియోలను పెడుతున్న సుమారు 20 చానల్స్పై కల్యాణి ఫిర్యాదు చేసింది. ఆ చానల్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కల్యాణి తన కంప్లెయింట్లో కోరింది. దీంతో సీసీఎస్ పోలీసులు సదరు చానల్స్పై ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. 67ఎ, 509 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే అలాంటి చానల్స్పై తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
అయితే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో మొదట వివాదం జరిగింది ఈ ప్రాంక్ వీడియోల వల్లే. కానీ ఆమె ఆ పాపను పెంచుకుంటుండడంపై ఆరోపణలు రావడంతో ప్రాంక్ వీడియోల కేసు పెండింగ్లో పడింది. అయితే ఇప్పుడు ఆమెకు దత్తత కేసులో ఊరట లభించడంతో.. ఇక ముందుగా అనుకున్నట్లుగానే ఆమె అలాంటి చానల్స్పై యుద్ధం ప్రకటించింది. దీంతో ఆ చానల్స్ను బ్లాక్ చేయాలని ఆమె కేసు పెట్టింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…