Jr NTR : ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరు. వరుస హిట్స్ తో విభిన్న పాత్రలతో డబుల్, త్రిబుల్ రోల్స్ లో సైతం తారక్ ఆకట్టుకుంటున్నాడు. తాత పోలికలున్నాయంటూ ఈయనకి అప్పటికే మంచి గుర్తింపు రావడంతో నందమూరి అభిమానులకు అభిమాన పాత్రుడయ్యాడు. ఒక్కో సినిమాకు కనీసం రూ.40 కోట్లకు పైగానే అందుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల మూవీతోపాటు ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే, కేవలం 17 ఏళ్ల వయసులోనే హీరో అయిపోయాడు. అంతకుముందే గుణశేఖర్ తెరకెక్కించిన బాల రామాయణం సినిమాతో బాలా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి అవార్డులతో పాటు ప్రశంసలు వచ్చాయి.
దాంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా తారక్ ఎంట్రీ ఇచ్చాడు. ఓటు హక్కు కూడా రాని వయసులో మూతిమీద మీసాలు కూడా లేని టైమ్లోనే ఇండస్ట్రీ రికార్డులతో ఆడుకున్నాడు. నందమూరి వంశం నుంచి వచ్చి బాలయ్య తర్వాత స్టార్ హీరోగా తారక్ నిలబడ్డాడు. ఇప్పుడు బాబాయ్ కంటే చాలా పైనే ఉన్నాడని చెప్పాలి. స్టూడెంట్ నెం 1, ఆది సినిమాలతో తానేంటో నిరూపించుకుని, ఇక సింహాద్రి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. జూనియర్ కెరీర్ ఆరంభంలోని కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా తొలి సినిమా పారితోషికం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తారక్ హీరోగా విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్ను చూడాలని డిజాస్టర్ అయినప్పటికీ గుర్తింపు బాగానే వచ్చింది. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్కు నిర్మాత రామోజీ రావు రూ.4 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. నిజానికి అప్పటికి ఆ ఎమౌంట్ తక్కువేమీ కాదు. అయితే ఓటు హక్కు కూడా రాని ఎన్టీఆర్ కు ఆ రూ.4 లక్షలతో ఏం చేయాలో అర్థం కాలేదట. వెంటనే ఆ సొమ్ము తీసుకెళ్లి తల్లి శాలినికి తారక్ గిఫ్ట్ గా ఇచ్చేశాడట. అయితే ఇప్పుడు మాత్రం కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు తారక్.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…