Liver : మన శరీరంలో ఉండే అనేక అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు, శక్తిని గ్రహించి శరీరానికి అందిస్తుంది. రక్తంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయ పడుతుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. ఇలా కాలేయం అనేక రకాల పనులు చేస్తుంది. అయితే కొన్ని రకాల కారణాల వల్ల లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో క్రమేణా లివర్ చెడిపోతుంది. అయితే లివర్ పనితీరు మందగించినప్పుడే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యం బాగాలేదని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ లివర్ సమస్య ఉన్నట్లు తేలితే ముందుగానే చికిత్స తీసుకోవచ్చు. దీంతో లివర్ చెడిపోకుండా కాపాడుకున్నవారమవుతాము. ఇక లివర్ పనితీరు బాగాలేనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. గ్యాస్, కళ్ల కింద నల్లని వలయాలు, కోపం, విసుగు, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, మొటిమలు, దురదలు, దద్దుర్లు, మహిళలకు అయితే రుతుక్రమం సరిగ్గా లేకపోవడం, నిద్రలేమి, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఫుడ్ అలర్జీలు, భోజనం చేశాక వికారంగా ఉండడం.. ఇవన్నీ లివర్ పనితీరు మందగించిందని తెలియజేసే లక్షణాలు. కనుక ఇవి ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం ఉత్తమం. దీంతో లివర్ పూర్తిగా చెడిపోకుండా ముందుగానే అడ్డుకోవచ్చు.
ఇక లివర్ పనితీరు మందగించేందుకు అనేక కారణాలు ఉంటాయి. మెడిసిన్లను అధికంగా వాడడం, మద్యం ఎక్కువగా సేవించడం, అధిక బరువు వంటి కారణాల వల్ల లివర్ అనారోగ్యం బారిన పడుతుంది. అయితే వీటి నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి. దీని వల్ల కూడా లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలా లివర్ను రక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…