Jiobook 4g : టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి వేదికైంది. ఇప్పటికే టెలికాం సేవల ద్వారా ఎన్నో లక్షల మంది వినియోగదారుల మన్ననలు పొందిన జియో మరో సంచలనాన్ని ప్రవేశపెట్టింది. కేవలం రూ.15వేలకే ఓ నూతన 4జి ల్యాప్టాప్ను జియో లాంచ్ చేసింది. దీన్ని ఇది వరకే ప్రకటించారు. ఇక ఇప్పుడు ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని జియో ఆన్లైన్ స్టోర్లో కొనుగోలు చేయవచ్చు.
జియోబుక్ 4జి పేరిట రిలయన్స్ జియో ఓ నూతన ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. ఇందులో 4జి సేవలను పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఓఎస్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ ల్యాప్టాప్లో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. 11.6 ఇంచుల డిస్ప్లే ఉంది. వైఫై, బ్లూటూత్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 2 మెగాపిక్సల్ వెబ్ క్యామ్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీంతో 8 గంటలకు పైగానే బ్యాకప్ వస్తుంది.
ఈ ల్యాప్టాప్లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ వరకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ యాప్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ యాప్స్ను కూడా వాడుకోవచ్చు. జియో బుక్ 4జి ల్యాప్టాప్ బ్లూ కలర్ ఆప్షన్లో మాత్రమే విడుదల కాగా దీని ధర రూ.15,799గా ఉంది. రిలయన్స్ డిజిటల్తోపాటు జియో ఆన్లైన్ స్టోర్లో ఈ ల్యాప్టాప్ ను కొనుగోలు చేయవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…