చిరంజీవి, విజ‌య‌శాంతి 20 ఏళ్లుగా అందుక‌నే మాట్లాడుకోలేదా..?

1980 దశాబ్దంలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ గానీ, డాన్స్ గానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. దర్శక నిర్మాతలకు వీరిద్దరి కాంబినేషన్ లో  సినిమా చేస్తే కాసుల వర్షం కురుస్తుందని గట్టిగా నమ్మేవారు.

చిరంజీవి, విజయశాంతిల కాంబినేషన్ లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, చాలెంజ్, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలు చాలానే ఉన్నాయి.  ఇప్పటికి కూడా వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని కోరుకునే అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అప్పటినుంచి వీరు మాట్లాడుకోవడం లేదనే కొన్నేళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై విజయశాంతి  తాజాగా వివరణ ఇవ్వటం జరిగింది.

సినిమాలకు విరామం ఇచ్చిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్లారు. మళ్లీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు విజయశాంతి.  ఇటీవల విజయశాంతి  ఓ ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడటం జరిగింది.  ఒకప్పుడు సినిమాలు 100, 200, 365 రోజులు వరకు ఆడేవి. ఆ సమయంలో 100 రోజులు పంక్షన్స్ జరిపి అందరికీ షీల్డ్ ఇచ్చేవారు. ప్ర‌స్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. వారం రోజులు సినిమా థియేటర్లలో న‌డిస్తే ఆ సినిమా హిట్ అంటున్నారు. ఇప్పటి జనరేషన్ చాలా కొత్తగా ఉన్నారు అని విజయశాంతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేను మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడింది సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే. ఆ రోజు చిరంజీవి గారు అలా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు. అప్పటికీ నేను ఆయనతో మాట్లాడి దాదాపు 20 సంవత్సరాలు అయి ఉంటుందని చెప్పుకొచ్చారు విజయశాంతి.

మా ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల్లేక‌పోవ‌డానికి ప్ర‌త్యేకమైన కార‌ణ‌మంటూ ఏమీ లేదు. రాజకీయాలలోకి వచ్చాక ఒకరితో ఒకరు మాట్లాడాల‌నుకుంటాం.  తెలంగాణ ఉద్యమం సమయంలో ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేయమని అందరిని అడిగాను. కానీ, ఏ ఒక్కరూ కూడా ఉద్యమం కోసం సపోర్ట్ చేయలేదు. తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంత సీరియస్ ఇష్యూ ఇది. అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలని ఆ టైంలో అడిగాము. ఎవరూ స్పందించకపోవటంతో ఆ రకంగా మాట్లాడుకోవడం మానేశాము. ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడుకోవడం అంతగా బాగుండదని విజయశాంతి తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM