చిరంజీవి, విజ‌య‌శాంతి 20 ఏళ్లుగా అందుక‌నే మాట్లాడుకోలేదా..?

1980 దశాబ్దంలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ గానీ, డాన్స్ గానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. దర్శక నిర్మాతలకు వీరిద్దరి కాంబినేషన్ లో  సినిమా చేస్తే కాసుల వర్షం కురుస్తుందని గట్టిగా నమ్మేవారు.

చిరంజీవి, విజయశాంతిల కాంబినేషన్ లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, చాలెంజ్, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలు చాలానే ఉన్నాయి.  ఇప్పటికి కూడా వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలని కోరుకునే అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అప్పటినుంచి వీరు మాట్లాడుకోవడం లేదనే కొన్నేళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై విజయశాంతి  తాజాగా వివరణ ఇవ్వటం జరిగింది.

సినిమాలకు విరామం ఇచ్చిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్లారు. మళ్లీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు విజయశాంతి.  ఇటీవల విజయశాంతి  ఓ ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడటం జరిగింది.  ఒకప్పుడు సినిమాలు 100, 200, 365 రోజులు వరకు ఆడేవి. ఆ సమయంలో 100 రోజులు పంక్షన్స్ జరిపి అందరికీ షీల్డ్ ఇచ్చేవారు. ప్ర‌స్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. వారం రోజులు సినిమా థియేటర్లలో న‌డిస్తే ఆ సినిమా హిట్ అంటున్నారు. ఇప్పటి జనరేషన్ చాలా కొత్తగా ఉన్నారు అని విజయశాంతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేను మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడింది సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే. ఆ రోజు చిరంజీవి గారు అలా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు. అప్పటికీ నేను ఆయనతో మాట్లాడి దాదాపు 20 సంవత్సరాలు అయి ఉంటుందని చెప్పుకొచ్చారు విజయశాంతి.

మా ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల్లేక‌పోవ‌డానికి ప్ర‌త్యేకమైన కార‌ణ‌మంటూ ఏమీ లేదు. రాజకీయాలలోకి వచ్చాక ఒకరితో ఒకరు మాట్లాడాల‌నుకుంటాం.  తెలంగాణ ఉద్యమం సమయంలో ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేయమని అందరిని అడిగాను. కానీ, ఏ ఒక్కరూ కూడా ఉద్యమం కోసం సపోర్ట్ చేయలేదు. తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంత సీరియస్ ఇష్యూ ఇది. అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలని ఆ టైంలో అడిగాము. ఎవరూ స్పందించకపోవటంతో ఆ రకంగా మాట్లాడుకోవడం మానేశాము. ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడుకోవడం అంతగా బాగుండదని విజయశాంతి తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM