Diwali Gifts : సాధారణంగా ఏ వ్యాపార సంస్థ యజమాని అయినా పండుగ సీజన్ వస్తుందంటే కస్టమర్లను ఆకర్షించడానికి కానుకలు, ఉచితాలు వంటి ఆఫర్లు ప్రకటిస్తారు. అమ్మకాలు పెంచుకునేందుకు వినూత్న ప్రచారం చేస్తూ అధిక ఆదాయం పొందాలని చూస్తారు. కానీ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఓ నగల షోరూం యజమాని అందరు బిజినెస్మెన్లా కాకుండా ఉద్యోగస్తుల పక్షపాతిగా మారారు. ఆయన అందించిన బహుమతులు చూసి ఉద్యోగులు ఎంతో సంబరపడిపోయారు.
చెన్నైకి చెందిన జ్యువెలరీ షాప్ యజమాని జయంతి లాల్ చయంతి తన సిబ్బందిని ఈ సంవత్సరం భారీ బహుమతులతో ఆశ్చర్యపరిచారు. దీపావళి కానుకగా రూ. 1.2 కోట్ల విలువైన కార్లు మరియు బైక్లను ఇచ్చారు. అతను 10 కార్లు మరియు 20 బైక్లను బహుమతిగా ఇచ్చారు. దీనితో సిబ్బంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ.. తన సిబ్బంది మరింత పని చేయడానికి. వారి జీవితంలో ప్రత్యేకత ఉండటానికి ఇది తోడ్పడుతుందని అన్నారు. వారు వ్యాపారంలో హెచ్చు తగ్గుల సమయంలో కూడా తనతో కలిసి పని చేశారని ఆయన తెలిపారు.
లాభాలు సంపాదించడంలో సహాయపడ్డారని పేర్కొన్నారు. వారు కేవలం సిబ్బంది మాత్రమే కాదు. వారు నా కుటుంబం. కాబట్టి వారికి అలాంటి సర్ ప్రైజ్లు ఇచ్చి వారిని నా కుటుంబ సభ్యుల్లాగే చూడాలనుకున్నాను. కానుకలు ఇచ్చిన తరువాత నేను మరింత సంతోషంగా ఉన్నాను. ప్రతీ యజమాని వారి సిబ్బందిని, సహోద్యోగులకు బహుమతులు ఇచ్చి గౌరవించాలి అని ఆయన తెలిపారు. కాగా.. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24 సోమవారం జరుపుకోనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…