Jayalalitha : చూడడానికి చాలా చక్కగా కనిపించే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత ఎక్కువగా వ్యాంప్ పాత్రలలో కనిపించేది. ఆ మధ్య మహేష్ బాబు నటించిన `భరత్ అనే నేను` చిత్రంలో స్పీకర్గా నటించి మెప్పించింది .దాదాపుగా 700కి పైగా చిత్రాలలో నటించిన ఆమె కమల్ హాసన్ సరసన ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సినిమాల కన్నా సీరియల్స్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం జయలలిత `ప్రేమ ఎంత మధురం` అనే సీరియల్లో నటిస్తోంది. ఇందులో ఆమె ఆర్య తల్లిగా శారదాదేవి పాత్రలో తన నటనతో మెప్పిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, తన మ్యారేజ్ లైఫ్ గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. మలయాళంలో ఇండస్ట్రీలో తాను వ్యాంప్ పాత్రలతోనే పరిచయం అయ్యానని తెలిపింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి వినోద్ అలాంటి సినిమాలు తీసే వ్యక్తి అని పేర్కొంది.
వినోద్ వాళ్ల నాన్న ప్రముఖ నిర్మాత ఆళ్లపుర పురుషన్. వినోద్ బూతు సినిమాలతోపాటు భక్తిరస చిత్రాలు కూడా తీసేవారు. అదే సమయంలో డీ గ్రేడ్ సినిమాలు చేసేవారు. వాటిలో తానే హీరోయిన్ అని చెప్పింది. మేం ఇద్దరం కలిసి ఏడేళ్లు ప్రేమించుకున్నామని, ఏడేళ్ల ప్రేమ తర్వాత నాకు డౌట్ వచ్చింది. పెళ్లి చేసుకుందామని చాలా ఒత్తిడి తెచ్చాను. ఆయన విశ్వరూపం పెళ్లి చేసుకున్నాక తెలిసింది.
కేవలం అతనికి ఉన్న అప్పులు, తన ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత చిత్రహింసలు పెట్టాడని వెల్లడించింది. ప్రస్తుతం తన జీవితం హాయిగా ఉందని, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నానని తెలియజేసింది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…