Jani Master : రాజకీయాలు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ వారసత్వానికి పెట్టింది పేరు అన్నట్టు ఉంటున్నాయి. ముఖ్యంగా సినిమాల్లో అయితే ఇక్కడ టాలెంట్ కంటే.. మన వాడు అయితే చాలు అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబం పేరు చెప్పుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు. దానికి తగ్గట్టే తాతల పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకుని కొందరు.. అమ్మ, పిన్నమ్మ పేర్లు చెప్పుకొని మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇండస్ట్రీపై పడి బ్రతికేస్తున్నారు. వీళ్లల్లో కొందరికి హీరో అయ్యే లక్షణాలు కూడా లేవు అని అందరికీ తెలిసిందే.
అయితే సినీ ఇండస్ట్రీ చాలా విశాలమైనది. ఉన్న హీరోలు చాలదన్నట్లు.. కొత్త హీరోలకు కూడా అవకాశం ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న హీరోలే కొత్త కథలు దొరకక తీసిన కథలనే మళ్ళీ తీస్తూ అట్టర్ ఫ్లాప్ సినిమాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఒక కొరియోగ్రాఫర్ హీరోగా ఎంట్రీ ఇస్తే జనాలు నవ్వుకోరూ..? ప్రస్తుతం అదే జరుగుతోంది.
సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్గా దూసుకుపోతోన్నాడు జానీ మాస్టర్. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలోనూ జానీ మాస్టర్ తన సత్తాను చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తే అవి ట్రెండ్ అవుతాయి. ఈ మధ్యే బీస్ట్ సినిమాలో విజయ్, పూజా హెగ్డేలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. అరబిక్ కుత్తు, హళమితి హబీబీ అంటూ అందరినీ ఊపు ఊపేశాడు జానీ మాస్టర్. అయితే శుభ్రంగా వచ్చిన పని చేసుకోక హీరోగా ఎంట్రీ ఇచ్చి జానీ మాస్టర్ తప్పు చేశారు అంటున్నారు కొందరు నెటిజన్లు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా యథా రాజా తథా ప్రజా సినిమా ఆరంభమైంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్నారు. హీరో శర్వానంద్ క్లాప్ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుభ్రంగా వచ్చిన పని చేసుకోకుండా ఇలా హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై జానీ మాస్టర్ ను కొందరు ట్రోల్ చేస్తున్నారు . ఉన్న హీరోలే ఏం పిసుక్కోలేకపోతుంటే.. మీరేం పీకుదామని ఇండస్ట్రీకి వచ్చారు సార్.. అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి.. జానీ మాస్టర్ హీరోగా రాణిస్తారో లేదో..!
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…