Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా ముద్ర పడినప్పటికీ జాన్వీ కపూర్ నటనలో మంచి మార్కులే కొట్టేసింది. ఈమె నటించిన పలు బాలీవుడ్ మూవీలు మరీ బ్లాక్ బస్టర్ హిట్స్ కాలేదు. అయినప్పటికీ ఒక మోస్తరుగా టాక్ సాధించాయి. దీంతో జాన్వీ కపూర్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ భారీ స్థాయిలో హిట్ కోసం ఈమె ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తోంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండలు ప్రస్తుతం లైగర్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో కీలకపాత్రను పోషిస్తున్నారు.
అయితే లైగర్ మూవీలో మొదట జాన్వీ కపూర్నే అనుకున్నారట. కానీ ఆమెకు కాల్ షీట్స్ సర్దుబాటు కాలేదట. ఆమె బాలీవుడ్లో పలు ఇతర మూవీలతో బిజీగా ఉంది. అందువల్ల ఆమె లైగర్ మూవీ చేయలేకపోయింది. దీంతో అనన్య పాండేను ఆ అవకాశం వరించింది.
అయితే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల కాంబోలో ఇంకో మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. లైగర్ మూవీతో ఈ ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. దీంతో వీరిద్దరూ ఇంకో మూవీని చేయాలని ఆలోచిస్తున్నారట. ఆ మూవీ ఈ ఏడాది చివరి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక అందులో నటించాల్సిందిగా పూరీ.. జాన్వీని ఒప్పించారట. ఇందుకు జాన్వీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అదే నిజం అయితే జాన్వీ నటించే తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
ఇక జాన్వీ కపూర్ను కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ఆమె తండ్రి బోనీ కపూర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…