Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా ముద్ర పడినప్పటికీ జాన్వీ కపూర్ నటనలో మంచి మార్కులే కొట్టేసింది. ఈమె నటించిన పలు బాలీవుడ్ మూవీలు మరీ బ్లాక్ బస్టర్ హిట్స్ కాలేదు. అయినప్పటికీ ఒక మోస్తరుగా టాక్ సాధించాయి. దీంతో జాన్వీ కపూర్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ భారీ స్థాయిలో హిట్ కోసం ఈమె ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తోంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండలు ప్రస్తుతం లైగర్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో కీలకపాత్రను పోషిస్తున్నారు.
అయితే లైగర్ మూవీలో మొదట జాన్వీ కపూర్నే అనుకున్నారట. కానీ ఆమెకు కాల్ షీట్స్ సర్దుబాటు కాలేదట. ఆమె బాలీవుడ్లో పలు ఇతర మూవీలతో బిజీగా ఉంది. అందువల్ల ఆమె లైగర్ మూవీ చేయలేకపోయింది. దీంతో అనన్య పాండేను ఆ అవకాశం వరించింది.
అయితే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల కాంబోలో ఇంకో మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. లైగర్ మూవీతో ఈ ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. దీంతో వీరిద్దరూ ఇంకో మూవీని చేయాలని ఆలోచిస్తున్నారట. ఆ మూవీ ఈ ఏడాది చివరి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక అందులో నటించాల్సిందిగా పూరీ.. జాన్వీని ఒప్పించారట. ఇందుకు జాన్వీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అదే నిజం అయితే జాన్వీ నటించే తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
ఇక జాన్వీ కపూర్ను కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ఆమె తండ్రి బోనీ కపూర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…