Jai Bhim Movie : సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలంటే అతి పెద్ద భారీ సెట్టింగ్స్ వేయాల్సి ఉంటుంది. అయితే కథ సన్నివేశాన్ని బట్టి ఆ సెట్టింగ్స్ ను రూపొందించుకుంటారు. అయితే కొన్ని సన్నివేశాలు తీయాలంటే ప్రత్యేకంగా కొన్ని నిజమైన కట్టడాలను పోలి ఉన్న సెట్టింగ్ లను వేయాల్సి వస్తుంది. ఇలాంటి సెట్ వేసేటప్పుడు నిజంగానే వాటి కొలతలు, వాటి రూపురేఖల మాదిరిగానే వేయాల్సి ఉంటుంది. ఇలాంటి సెట్టింగులు వేయడంలో గుణశేఖర్ దిట్ట అని చెప్పవచ్చు. ఈయన ఏకంగా మధుర మీనాక్షి ఆలయాన్ని అలాగే చార్మినార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఇలాంటి మరొక సాహసాన్ని చేసింది జై భీమ్ చిత్రబృందం. సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల అవుతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ సన్నివేశాలు కోర్టులో ఉండటం వల్ల ఏకంగా చిత్రబృందం చెన్నై హైకోర్టును యథావిధిగా పునర్నిర్మించింది. సాధారణంగా చెన్నై హైకోర్టులో కి ఇతరులకు ఎవరికీ అనుమతి ఉండదు, అలాంటిది కొన్ని ఫోటోల ఆధారంగా కోర్టును ఎంతో అద్భుతంగా నిర్మించారు.
సాధారణంగా కోర్టు లోపలికి ఎవరికీ అనుమతి ఉండదు కానీ జై భీమ్ చిత్ర బృందానికి మాత్రం కేవలం కోర్టు హాలు చూడటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అదృష్టం కొద్దీ జస్టిస్ చంద్రు వాదించిన కేసులలో పలు ఫోటోలు ఉండడం వల్ల వాటి ఆధారంగా కేవలం 25 రోజులలోనే కోటను నిర్మించినట్లు చిత్రబృందం తెలియజేసింది.
ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత కొందరు హైకోర్టు న్యాయమూర్తులను అలాగే న్యాయవాదిని పిలిపించి చూపించగా వారు ఎంతో ఆశ్చర్యపోతూ హైకోర్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.. అని చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…