Jai Bhim Movie : సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలంటే అతి పెద్ద భారీ సెట్టింగ్స్ వేయాల్సి ఉంటుంది. అయితే కథ సన్నివేశాన్ని బట్టి ఆ సెట్టింగ్స్ ను రూపొందించుకుంటారు. అయితే కొన్ని సన్నివేశాలు తీయాలంటే ప్రత్యేకంగా కొన్ని నిజమైన కట్టడాలను పోలి ఉన్న సెట్టింగ్ లను వేయాల్సి వస్తుంది. ఇలాంటి సెట్ వేసేటప్పుడు నిజంగానే వాటి కొలతలు, వాటి రూపురేఖల మాదిరిగానే వేయాల్సి ఉంటుంది. ఇలాంటి సెట్టింగులు వేయడంలో గుణశేఖర్ దిట్ట అని చెప్పవచ్చు. ఈయన ఏకంగా మధుర మీనాక్షి ఆలయాన్ని అలాగే చార్మినార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఇలాంటి మరొక సాహసాన్ని చేసింది జై భీమ్ చిత్రబృందం. సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల అవుతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ సన్నివేశాలు కోర్టులో ఉండటం వల్ల ఏకంగా చిత్రబృందం చెన్నై హైకోర్టును యథావిధిగా పునర్నిర్మించింది. సాధారణంగా చెన్నై హైకోర్టులో కి ఇతరులకు ఎవరికీ అనుమతి ఉండదు, అలాంటిది కొన్ని ఫోటోల ఆధారంగా కోర్టును ఎంతో అద్భుతంగా నిర్మించారు.
సాధారణంగా కోర్టు లోపలికి ఎవరికీ అనుమతి ఉండదు కానీ జై భీమ్ చిత్ర బృందానికి మాత్రం కేవలం కోర్టు హాలు చూడటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అదృష్టం కొద్దీ జస్టిస్ చంద్రు వాదించిన కేసులలో పలు ఫోటోలు ఉండడం వల్ల వాటి ఆధారంగా కేవలం 25 రోజులలోనే కోటను నిర్మించినట్లు చిత్రబృందం తెలియజేసింది.
ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత కొందరు హైకోర్టు న్యాయమూర్తులను అలాగే న్యాయవాదిని పిలిపించి చూపించగా వారు ఎంతో ఆశ్చర్యపోతూ హైకోర్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.. అని చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…