Jabardasth : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షో చుట్టూ అనేక వివాదాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి రోజా వెళ్లిపోగా.. ఈ మధ్య కాలంలో పలువురు స్టార్ కమెడియన్లు కూడా దూరమయ్యారు. దీంతో జబర్దస్త్ కళ తప్పింది. అది చాలదన్నట్లు కొందరు కమెడియన్లు ఈ షోపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కిర్రాక్ ఆర్పీ, అప్పారావులు ఈ షో గురించి విమర్శలు చేశారు.
జబర్దస్త్ లో కనీసం మర్యాద ఇవ్వరని, భోజనం కూడా పెట్టరని.. అసలు విలువ ఇవ్వరని అప్పారావు, ఆర్పీలు తెలిపారు. నాగబాబు అందరికీ సహాయం చేసేవారని అన్నారు. అయితే ఇందుకు ఆది, రామ్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జబర్దస్త్లో ఆర్పీ చెప్పినట్లు ఏమీ జరగదని, వాస్తవానికి మల్లెమాల వారు తమకు ఎంతో సహాయం చేశారని అన్నారు. దీంతో అసలు ఎవరి మాటలను నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ ప్రొడక్షన్ మేనేజర్ ఏడుకొండలు సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోపై వస్తున్న అనేక వివాదాలపై ఏడుకొండలు మాట్లాడారు. జబర్దస్త్లో నాగబాబు కన్నా రోజాకే ఎక్కువ రెమ్యురేషన్ ఇచ్చామని వివరించారు. అందుకు కారణాలను కూడా ఆయన చెప్పారు. రోజా ఒక హీరోయిన్ అని, నాగబాబు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు అని.. ఆ కారణాల వల్లే రోజాకు ఎక్కువగా, నాగబాబుకు తక్కువగా రెమ్యునరేషన్ ను అందించామని అన్నారు. అయితే ఈ షోపై కొందరు చేస్తున్న విమర్శలు సరికాదని అన్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో గురించి రోజుకో కొత్త విషయం బయట పడుతుండడం సంచలనాలను కలిగిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…