Jabardasth : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షో చుట్టూ అనేక వివాదాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి రోజా వెళ్లిపోగా.. ఈ మధ్య కాలంలో పలువురు స్టార్ కమెడియన్లు కూడా దూరమయ్యారు. దీంతో జబర్దస్త్ కళ తప్పింది. అది చాలదన్నట్లు కొందరు కమెడియన్లు ఈ షోపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కిర్రాక్ ఆర్పీ, అప్పారావులు ఈ షో గురించి విమర్శలు చేశారు.
జబర్దస్త్ లో కనీసం మర్యాద ఇవ్వరని, భోజనం కూడా పెట్టరని.. అసలు విలువ ఇవ్వరని అప్పారావు, ఆర్పీలు తెలిపారు. నాగబాబు అందరికీ సహాయం చేసేవారని అన్నారు. అయితే ఇందుకు ఆది, రామ్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జబర్దస్త్లో ఆర్పీ చెప్పినట్లు ఏమీ జరగదని, వాస్తవానికి మల్లెమాల వారు తమకు ఎంతో సహాయం చేశారని అన్నారు. దీంతో అసలు ఎవరి మాటలను నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ ప్రొడక్షన్ మేనేజర్ ఏడుకొండలు సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోపై వస్తున్న అనేక వివాదాలపై ఏడుకొండలు మాట్లాడారు. జబర్దస్త్లో నాగబాబు కన్నా రోజాకే ఎక్కువ రెమ్యురేషన్ ఇచ్చామని వివరించారు. అందుకు కారణాలను కూడా ఆయన చెప్పారు. రోజా ఒక హీరోయిన్ అని, నాగబాబు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు అని.. ఆ కారణాల వల్లే రోజాకు ఎక్కువగా, నాగబాబుకు తక్కువగా రెమ్యునరేషన్ ను అందించామని అన్నారు. అయితే ఈ షోపై కొందరు చేస్తున్న విమర్శలు సరికాదని అన్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో గురించి రోజుకో కొత్త విషయం బయట పడుతుండడం సంచలనాలను కలిగిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…