Dhruva Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, దర్శకుడు సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన ధృవ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో చరణ్కు జోడీగా రకుల్ నటించింది. అలాగే మరో ముఖ్య పాత్రలో అరవింద్ స్వామి యాక్టింగ్ను అదరగొట్టేశారు. ఈ మూవీ 9 డిసెంబర్ 2016వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ టైటిల్లో ధ అనే అక్షరం మీద 8 అనే నంబర్ను ఉంచుతారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. అయితే ఈ 8 అంకెకు, ఇందులో వాడిన అష్ట దిగ్బంధనం అనే పదానికి ఉన్న అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మూవీలో ఇచ్చిన 8 అంటే.. అష్ట దిగ్బంధనం అనే పదానికి.. శత్రువును తుదముట్టించే ముందు ఎనిమిది దిక్కుల నుండి రౌండప్ చేయాలి. అంటే పారిపోడానికి అవకాశమే లేకుండా చేయాలి. అలాగే ధృవ సినిమాలో కూడా రామ్ చరణ్ విలన్ అరవింద్ స్వామిని అన్ని విధాలుగా రౌండప్ చేస్తాడు. కాకపోతే దిక్కుల ప్రకారంగా కాకుండా విలన్ ఎదిగిన క్రమాన్ని ఒక్కొక్కటిగా దెబ్బ తీస్తాడు. అంటే అతనికి ఉండే కీర్తి, ధనం ఇలా అన్నింటినీ ఒక్కోదాన్ని దూరం చేస్తూ వస్తాడు. చివరకు మరణం వస్తుంది.
అష్ట దిగ్బంధనం అనే దాన్ని ఈ మూవీలో ఇంకో విధంగా ఉపయోగించారు. విలన్కు ఉన్న 8 అవకాశాలు దెబ్బ తీస్తాడు. అంటే.. ఓ గొప్ప సైంటిస్ట్ గా సమాజంలో గౌరవింపబడే వ్యక్తిని అదే సమాజం చేత ఛీ కొట్టించి అతని కీర్తిని దెబ్బ తీస్తాడు. అలాగే ఇతరుల ఆవిష్కరణలను తన ఆవిష్కరణలుగా పేటెంట్ హక్కులు పొందాడని తెలియజేస్తూ అతని మేథస్సును దెబ్బ తీస్తాడు. తన బలాన్నంతా పోగొడతాడు. కన్న తండ్రినే చంపాలని చూసిన అతడి చర్యను అతడి తండ్రికే తెలియజేస్తూ అతన్ని ఎమోషనల్గా దెబ్బ తీస్తాడు.
తరువాత అతని ధైర్యాన్ని ఎదిరించి దెబ్బ కొడతాడు. అలాగే ఓ డీల్ కోసం అంతా రెడీ చేసుకున్న డబ్బును సమయానికి అందకుండా అడ్డుకుని డబ్బు పరంగా దెబ్బ కొడతాడు. అలాగే మానవత్వాన్ని కూడా పోగొడతాడు. ఇలా ఏడింటిని చరణ్ దూరం చేస్తాడు. అయితే 8వ అంశం అయిన మరణంపై మాత్రం చరణ్ దృష్టి పెట్టడు. కానీ తాను అష్ట దిగ్బంధనం అయ్యానన్న విషయాన్ని గ్రహించిన విలన్ తన మరణాన్ని తానే ఫిక్స్ చేసుకుంటాడు. ఇలా అతని మరణంతో మొత్తం అష్ట దిగ్బంధనం పూర్తవుతుంది. దీన్ని ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. సినిమా హిట్ అయ్యేందుకు ఇది ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…