Anushka Shetty : తెలుగు సినీ ప్రేక్షకులకు జేజమ్మగా పేరుగాంచిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించినా.. అరుంధతి ద్వారానే ఎక్కువగా పేరు వచ్చింది. టాలీవుడ్లో సీనియర్ అగ్ర హీరోలు చాలా మందితో ఈమె నటించింది. అయితే సైజ్ జీరో అనే మూవీ ద్వారా ఈమె బాగా లావుగా మారిపోవడం.. తరువాత బరువు తగ్గాలనుకున్నా అది సాధ్యం కాకపోవడంతో.. ఈమెకు సినిమాల్లో ఆఫర్లు తగ్గాయి. బాహుబలి తరువాత దాదాపుగా సినిమా ఇండస్ట్రీకి ఈమె దూరమైందనే చెప్పవచ్చు. ఒకటి రెండు సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా అనుష్క శెట్టికి చెందిన ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.
తెలుగులో అనుష్క మొదటి చిత్రం సూపర్. ఇందులో ఆమె నాగార్జునతో కలిసి నటించింది. తరువాత కూడా వీరు పలు చిత్రాల్లో కలసి నటించారు. అలాగే నాగార్జున సినిమాల్లో ఈమె కొన్ని పాటల్లోనూ ప్రత్యేకంగా కనిపించింది. దీంతో వీరిమధ్య అఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తరువాత ఆమెను చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయనున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వాటిని నాగార్జున ఖండించారు. ఇక తాజాగా అనుష్క శెట్టికి, నాగార్జునకు మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది.
అనుష్క శెట్టిని నాగార్జున ప్రస్తుతం దూరం పెట్టారట. ఈ మేరకు టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈమెను ఆయన ఎందుకు దూరంగా పెట్టాడు.. అన్న విషయాలు మాత్రం బయటకు రావడం లేదు.. కానీ చైతన్యతో అనుష్క పెళ్లి వార్తలపై ఆమె తల్లి బాగా హర్ట్ అయిందట. అందుకనే నాగార్జున ఫ్యామిలీకి దూరంగా ఉండాలని ఆమె చెప్పిందట. దీంతో అనుష్క అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటుందని సమాచారం. దీంతో నాగార్జున కూడా ఆమెకు దూరంగానే ఉంటున్నారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక నాగార్జున, అనుష్క శెట్టి కలసి సూపర్, డాన్, కింగ్, కేడీ, రగడ, ఢమరుకం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, ఓం నమో వెంకటేశాయ.. తదితర చిత్రాల్లో నటించారు. కాగా అనుష్క శెట్టి చివరిసారిగా నిశ్శబద్ధం అనే మూవీలో నటించింది. ఇది 2020లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశ పరిచింది. అప్పటి నుంచి ఈమె ఖాళీగానే ఉంటోంది.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…