Jabardasth Varsha : బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గతంలో మోడల్గా రాణించింది. అయినప్పటికీ జబర్దస్త్ షోకు వచ్చాకే ఈమెకు మరింత పాపులారిటీ పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జబర్దస్త్ లో లేడీ కమెడియన్గా రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది.
హీరోయిన్లలాగానే జబర్దస్త్ వర్ష కూడా అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తుంటుంది. మతులు పోగొట్టే ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈమె ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్ష సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతని పరిస్థితి గురించి వర్ష పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం తన సోదరుడు కోలుకున్నాడని వర్ష సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. తన సోదరుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని చెబుతూ ఆ ఫొటోను కూడా జత చేసింది. ఈ సందర్భంగా వర్ష ఎమోషనల్ అయింది. సంక్రాంతి వేడుకల్లో సంతోషంగా ఉన్న తమ కుటుంబానికి ఈ ప్రమాదం వార్త పెద్ద షాక్ను ఇచ్చిందని ఆమె తెలియజేసింది. కాగా సోషల్ మీడియా వేదికగా వర్ష ఈ సందర్భంగా అందరికీ ఒక రిక్వెస్ట్ చేసింది.
దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ముగ్గురు వ్యక్తులు ట్రిపుల్ రైడింగ్తో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే నా సోదరుడికి ప్రమాదం జరిగింది. హాస్పిటల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. మా ఫ్యామిలీ అంతా బాధపడ్డాం. ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ఎవరూ ఏ ఫ్యామిలీలోనూ బాధపడాల్సిన అవసరం రావొద్దు.. అని పోస్ట్ పెట్టింది వర్ష. కాగా వర్ష పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…