Jabardasth : అనసూయ, ఆది జబర్దస్త్ స్టేజిపై ఉన్నారంటే చాలు.. హాస్యం బాగా పండిస్తారు. ముఖ్యంగా ఆది అనసూయపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు. వాటిల్లో పంచ్లు బాగా ఉంటాయి. వాటిల్లో డబుల్ మీనింగ్లు కూడా వస్తుంటాయి. ఇక తాజాగా ఆది ఇలాగే అనసూయపై మరోసారి రెచ్చిపోయి పంచ్ల వర్షం కురిపించాడు.
అక్టోబర్ 7వ తేదీన ప్రసారం కానున్న జబర్దస్త్కు చెందిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా యూట్యూబ్లో విడుదల చేశారు. అందులో ఆది స్కిట్లో భాగంగా దోశ సెంటర్ను ఏర్పాటు చేస్తాడు. దానికి అనసూయ వస్తుంది. వచ్చీ రాగానే.. అనసూయ ఇక్కడ.. అని అంటుంది. అందుకు అతను.. ఆది ఇక్కడ.. మరి ఏమైనా ఉందా ? అంటూ.. డబుల్ మీనింగ్లో పంచ్ వేశాడు.
ఇక దోశ సెంటర్ కు వచ్చిన శాంతిపై కూడా ఆది పంచ్ వేశాడు. శాంతి రాగానే ఇంకా బోనీ కాలేదు, ఎవరైనా బోనీ చేయగానే పదో పరకో ఇస్తా, ఆగు.. అంటాడు. ఇక అనసూయ చేతిని పట్టుకుని ఆది దోశలు ఎలా వేయాలో నేర్పిస్తాడు. దీంతో అనసూయ తనకు దోశ వేయడం వచ్చిందని సంబరపడిపోతుంది. అంతలో ఆది కల్పించుకుని.. అప్పుడే కాదు, ఇంకో రెండు సార్లు తిప్పాలి.. అంటాడు. దీంతో అనసూయకు పంచ్ పడింది.
ఇక స్కిట్లో భాగంగా దొరబాబు ఉండి దోశలో తెల్ల వెంట్రుక వచ్చిందని అంటాడు. అందుకు ఆది స్పందిస్తూ.. అనసూయ, చూసుకుని దోశ వేయాలి కదరా.. అంటూ ఆమెకు ముసలితనం వచ్చిందని పరోక్షంగా పంచ్ వేస్తాడు. దీంతో అనసూయ అతన్ని కొట్టేందుకు ముందుకు వస్తుంది. ఇలా ఆది స్కిట్ వచ్చే వారం నవ్వుల పువ్వులు పూయించనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…