Anasuya : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఎంతోమంది ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జెమిని టీవీలో వారంతాలలో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ కార్యక్రమం ఎన్నో అంచనాల నడుమ ప్రసారమవుతోంది. అయితే ఈ షో కి యాంకర్ గా తమన్నాను తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తమన్నా యాంకర్ గా ఉండటం చేత ఈ కార్యక్రమంపై నిర్వాహకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే అనుకున్న విధంగానే మొదటి వారాలలో ఈ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత ఈ కార్యక్రమం రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ క్రమంలోనే నిర్వాహకులు ఈ కార్యక్రమానికి యాంకర్ ను మార్చాలని భావించారు. బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జబర్దస్త్ యాంకర్ అనసూయను మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి యాంకర్ గా తీసుకోనున్నట్లు సమాచారం.
అయితే ఈ కార్యక్రమానికి తమన్నా షెడ్యూల్ ప్రకారం రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ప్రస్తుతం తన షెడ్యూలు ముగియడంతో తాను అడిగిన పారితోషకాన్ని నిర్వాహకులు ఇవ్వలేక.. తన స్థానంలో అనసూయని తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే తమన్నా వ్యాఖ్యాతగా ఉండడం చేత ఈ కార్యక్రమం రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయని, ఈ కార్యక్రమ రేటింగ్స్ ను పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమానికి జబర్దస్త్ యాంకర్ అనసూయను తీసుకుంటున్నట్లు సమాచారం.
సాదారణంగా సినీ తారలు సినిమాల్లో బాగా చేస్తారు. కానీ బుల్లితెర విషయానికి వస్తే.. రెగ్యులర్ యాంకర్లలా సినీ తారలు పెర్ఫార్మ్ చేయలేరు. అందువల్లే.. బుల్లితెరపై యాంకరింగ్లో పండిపోయిన అనసూయ అయితే ఈ షోకు బాగుంటుందని నిర్వాహకులు అనుకున్నారట. పైగా తమన్నాతో పోల్చితే.. అనసూయ రెమ్యునరేషనే తక్కువగా ఉంటుంది. కనుక ఎటు చూసినా అనసూయే బెటర్ అని ఈ షోకు ఆమెనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనసూయ ఖాతాలో ఇంకో షో పడినట్లే మనం అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…