Samantha : గతకొంత కాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సామ్పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. అయితే సామ్ మాత్రం ఇవన్ని లైట్ తీసుకుంది. అంతేకాదు సోషల్ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా సామ్ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, మరికొందరు ఆమె గర్భసంచి తీయించుకుందని.. ఇలా ఏవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు చేయించింది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సమంత లుక్స్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. మొఖం లాగేసి డల్ గా మారిపోయి.. ఓ పేషెంట్లా తయారైంది అంటున్నారు జనాలు. ఆమె చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని, దానికి అమెరికాలో చికిత్స తీసుకుంటుందని పుకార్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా సమంత మేనేజర్ స్పందించాడు.
సమంత అనారోగ్యంపై వస్తోన్న వార్తలను మేనేజర్ ఖండించాడు. సమంతకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశాడు. సమంత ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదని, ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రూమర్స్ ని నమ్మవద్దని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సమంత అమెరికాలో ఉండటానికి కారణమేంటనే దానిపై మాత్రం మేనేజర్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో శాకుంతలం, యశోద, అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా చేస్తుంది. అలాగే హాలీవుడ్ లో ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ లో నటిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…