IPL 2021 : క్రికెట్ మ్యాచ్లు అంటే అంతే. ఒకసారి ఒకరిది పైచేయి అవుతుంది. ఒకసారి ఒకరు ఓడిపోతారు. ఇంకోసారి ఇంకొకరు గెలుస్తారు. దాన్ని స్పోర్టివ్గానే తీసుకోవాలి. కానీ అభిమానులు మాత్రం ఇలాంటి వాటిని ఆషామాషీగా తీసుకోరు. ఓటమి అనేది నిజానికి క్రీడాకారుల కన్నా అభిమానులనే ఎక్కువగా బాధిస్తుంది. అందుకే కాబోలు.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కోల్కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు ఓటమి పాలైంది. 138 పరుగులను డిఫెండ్ చేయలేక చేతులెత్తేసింది. అయితే ఎన్నో సీజన్లలో టాప్ లో ఉంటూ కొన్ని సార్లు ప్లే ఆఫ్స్కు కూడా వెళ్లిన బెంగళూరు ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఈసారైనా ప్లే ఆఫ్స్కు వెళ్లి సత్తా చాటుతుందని భావించారు. కానీ అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. బెంగళూరు ఓటమి పాలవడంతో ఆ జట్టు మొత్తాన్ని అభిమానులు దారుణంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లిని కూడా నెటిజన్లు వదలడం లేదు.
అయితే మ్యాచ్ అనంతరం కోహ్లి సహా పలు ఇతర బెంగళూరు ఆటగాళ్లు భావోద్వేగంతో కనిపించారు. ఇక తమపై వస్తున్న ట్రోల్స్ కు స్పందించిన బెంగళూరు బ్యాట్స్ మన్ మ్యాక్స్వెల్.. ఘాటుగా, దీటుగా బదులిచ్చాడు. అసలైన ఫ్యాన్స్ తమను నిందించరని, తమకు మద్దతుగా ఉంటారని అన్నాడు. ఇలాంటి ఫ్యాన్స్ ను చూస్తే అసహ్యంగా ఉందన్నాడు.
కాగా బెంగళూరు రూ.14.25 కోట్లకు మ్యాక్స్వెల్ను కొనుగోలు చేసినందుకు అతను జట్టుకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు. ఈ సీజన్లో 14 మ్యాచ్లలో ఆడిన అతను 144.10 స్ట్రయిక్ రేట్తో మొత్తం 513 పరుగులు చేసి బెంగళూరు టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని సగటు 42.75గా ఉంది. ఇక బౌలింగ్ కూడా చేసిన అతను 3 వికెట్లు తీశాడు. అతను గత సీజన్లలో ఆడిన జట్లకు పెద్దగా ఆడలేదు. కానీ ఈ సీజన్లో బెంగళూరు తరఫున ఆడి చక్కని ప్రదర్శనను చేయడం విశేషం. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై నెగ్గిన కోల్కతా క్వాలిఫైర్ 2 లో ఢిల్లీతో తలపడనుంది. అలాగే క్వాలిఫైర్ 1లో గెలిచిన చెన్నై ఇప్పటికే ఫైనల్స్ కు దూసుకెళ్లిన విషయం విదితమే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…