IPL 2021 : క్రికెట్ మ్యాచ్లు అంటే అంతే. ఒకసారి ఒకరిది పైచేయి అవుతుంది. ఒకసారి ఒకరు ఓడిపోతారు. ఇంకోసారి ఇంకొకరు గెలుస్తారు. దాన్ని స్పోర్టివ్గానే తీసుకోవాలి. కానీ అభిమానులు మాత్రం ఇలాంటి వాటిని ఆషామాషీగా తీసుకోరు. ఓటమి అనేది నిజానికి క్రీడాకారుల కన్నా అభిమానులనే ఎక్కువగా బాధిస్తుంది. అందుకే కాబోలు.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కోల్కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు ఓటమి పాలైంది. 138 పరుగులను డిఫెండ్ చేయలేక చేతులెత్తేసింది. అయితే ఎన్నో సీజన్లలో టాప్ లో ఉంటూ కొన్ని సార్లు ప్లే ఆఫ్స్కు కూడా వెళ్లిన బెంగళూరు ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఈసారైనా ప్లే ఆఫ్స్కు వెళ్లి సత్తా చాటుతుందని భావించారు. కానీ అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. బెంగళూరు ఓటమి పాలవడంతో ఆ జట్టు మొత్తాన్ని అభిమానులు దారుణంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లిని కూడా నెటిజన్లు వదలడం లేదు.
అయితే మ్యాచ్ అనంతరం కోహ్లి సహా పలు ఇతర బెంగళూరు ఆటగాళ్లు భావోద్వేగంతో కనిపించారు. ఇక తమపై వస్తున్న ట్రోల్స్ కు స్పందించిన బెంగళూరు బ్యాట్స్ మన్ మ్యాక్స్వెల్.. ఘాటుగా, దీటుగా బదులిచ్చాడు. అసలైన ఫ్యాన్స్ తమను నిందించరని, తమకు మద్దతుగా ఉంటారని అన్నాడు. ఇలాంటి ఫ్యాన్స్ ను చూస్తే అసహ్యంగా ఉందన్నాడు.
కాగా బెంగళూరు రూ.14.25 కోట్లకు మ్యాక్స్వెల్ను కొనుగోలు చేసినందుకు అతను జట్టుకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు. ఈ సీజన్లో 14 మ్యాచ్లలో ఆడిన అతను 144.10 స్ట్రయిక్ రేట్తో మొత్తం 513 పరుగులు చేసి బెంగళూరు టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని సగటు 42.75గా ఉంది. ఇక బౌలింగ్ కూడా చేసిన అతను 3 వికెట్లు తీశాడు. అతను గత సీజన్లలో ఆడిన జట్లకు పెద్దగా ఆడలేదు. కానీ ఈ సీజన్లో బెంగళూరు తరఫున ఆడి చక్కని ప్రదర్శనను చేయడం విశేషం. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై నెగ్గిన కోల్కతా క్వాలిఫైర్ 2 లో ఢిల్లీతో తలపడనుంది. అలాగే క్వాలిఫైర్ 1లో గెలిచిన చెన్నై ఇప్పటికే ఫైనల్స్ కు దూసుకెళ్లిన విషయం విదితమే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…