IPL 2021 : క్రికెట్ మ్యాచ్లు అంటే అంతే. ఒకసారి ఒకరిది పైచేయి అవుతుంది. ఒకసారి ఒకరు ఓడిపోతారు. ఇంకోసారి ఇంకొకరు గెలుస్తారు. దాన్ని స్పోర్టివ్గానే తీసుకోవాలి. కానీ అభిమానులు మాత్రం ఇలాంటి వాటిని ఆషామాషీగా తీసుకోరు. ఓటమి అనేది నిజానికి క్రీడాకారుల కన్నా అభిమానులనే ఎక్కువగా బాధిస్తుంది. అందుకే కాబోలు.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కోల్కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు ఓటమి పాలైంది. 138 పరుగులను డిఫెండ్ చేయలేక చేతులెత్తేసింది. అయితే ఎన్నో సీజన్లలో టాప్ లో ఉంటూ కొన్ని సార్లు ప్లే ఆఫ్స్కు కూడా వెళ్లిన బెంగళూరు ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఈసారైనా ప్లే ఆఫ్స్కు వెళ్లి సత్తా చాటుతుందని భావించారు. కానీ అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. బెంగళూరు ఓటమి పాలవడంతో ఆ జట్టు మొత్తాన్ని అభిమానులు దారుణంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లిని కూడా నెటిజన్లు వదలడం లేదు.
అయితే మ్యాచ్ అనంతరం కోహ్లి సహా పలు ఇతర బెంగళూరు ఆటగాళ్లు భావోద్వేగంతో కనిపించారు. ఇక తమపై వస్తున్న ట్రోల్స్ కు స్పందించిన బెంగళూరు బ్యాట్స్ మన్ మ్యాక్స్వెల్.. ఘాటుగా, దీటుగా బదులిచ్చాడు. అసలైన ఫ్యాన్స్ తమను నిందించరని, తమకు మద్దతుగా ఉంటారని అన్నాడు. ఇలాంటి ఫ్యాన్స్ ను చూస్తే అసహ్యంగా ఉందన్నాడు.
కాగా బెంగళూరు రూ.14.25 కోట్లకు మ్యాక్స్వెల్ను కొనుగోలు చేసినందుకు అతను జట్టుకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు. ఈ సీజన్లో 14 మ్యాచ్లలో ఆడిన అతను 144.10 స్ట్రయిక్ రేట్తో మొత్తం 513 పరుగులు చేసి బెంగళూరు టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని సగటు 42.75గా ఉంది. ఇక బౌలింగ్ కూడా చేసిన అతను 3 వికెట్లు తీశాడు. అతను గత సీజన్లలో ఆడిన జట్లకు పెద్దగా ఆడలేదు. కానీ ఈ సీజన్లో బెంగళూరు తరఫున ఆడి చక్కని ప్రదర్శనను చేయడం విశేషం. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై నెగ్గిన కోల్కతా క్వాలిఫైర్ 2 లో ఢిల్లీతో తలపడనుంది. అలాగే క్వాలిఫైర్ 1లో గెలిచిన చెన్నై ఇప్పటికే ఫైనల్స్ కు దూసుకెళ్లిన విషయం విదితమే.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…