IPL 2021 : షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో కోల్కతా అద్భుతమైన విజయాన్ని సాధించింది. చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుస్తుందని భావించారు. కానీ చివరకు విజయం కోల్కతాను వరించింది. ఢిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా కష్టపడుతూ ఛేదించింది. దీంతో ఢిల్లీపై కోల్కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా ముందుగా ఫీల్డింగ్ చేయగా.. ఢిల్లీ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులను మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్ (36 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (30 పరుగులు)లు మాత్రమే రాణించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, లాకీ ఫెర్గుసన్, శివమ్ మావి చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 136 పరుగులు చేసింది. కోల్కతా బ్యాట్స్మెన్లలో శుబమన్ గిల్ (46 పరుగులు), వెంకటేష్ అయ్యర్ (55)లు రాణించారు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక ఢిల్లీ బౌలర్లలో అన్రిక్ నోర్జె, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడాలు తలా 2 వికెట్లు తీయగా, అవేష్ ఖాన్కు 1 వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్ లో విజయంతో కోల్కతా జట్టు ఈ నెల 15వ తేదీన ఫైనల్స్లో చెన్నైతో తలపడనుంది. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ను నిర్వహించనున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…