సాధారణంగా తమ పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే లేదా ఎవరైనా కిడ్నాప్ చేస్తే వారి కోసం సాయశక్తులా ప్రయత్నిస్తారు.ఈ విధంగా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు వారి కోసం వెతికిన వారి ఆచూకీ తెలియకపోతే వారిని క్రమంగా మర్చిపోతారు. కానీ ఈ తండ్రి మాత్రం రెండు సంవత్సరాల వయసులో తప్పిపోయిన తన కొడుకు కోసం ఏకంగా ఇరవై నాలుగు సంవత్సరాలు వెతికాడు. కొడుకు కోసం ఏకంగా ఆ తండ్రి ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి 24 సంవత్సరాల తర్వాత తన కొడుకు ఆచూకీ కనుగొని తనని గుండెలకి హత్తుకున్న ఘటన చైనాలో చోటు చేసుకుంది.
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు చెందిన గువా గాంగ్టాంగ్ కుమారుడు 1997లో తన రెండు సంవత్సరాల కొడుకు కిడ్నాప్ కి గురయ్యాడు. అప్పటి నుంచి తన బిడ్డ ఆచూకీ కోసం దేశమంతా జల్లెడ పట్టాడు. ఏకంగా ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో ఆ తండ్రి ఎన్నో ఇబ్బందులను, ప్రమాదాలను ఎదుర్కొన్నాడు. ఈ తండ్రి తన కొడుకు కోసం చేస్తున్న సాహసం తెలుసుకున్న దర్శకుడు అతడి ప్రయాణంపై ఏకంగా ఓ సినిమానే తీశాడు. ఆ సినిమాలో హాంగ్కాంగ్ సూపర్స్టార్ ఆండీలువా నటించగా.. సంచలన విజయం సాధించింది.
ఈ విధంగా తన కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ తండ్రి నిరీక్షణ 24 ఏళ్లకు ఫలించింది. ఎట్టకేలకు గాంగ్టాంగ్ తన కొడుకును గుర్తించాడు. అయితే తన కొడుకా కాదా అన్న అనుమానంతో అధికారులు వీరికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా వీరిద్దరూ తండ్రీకొడుకులని తేలడంతో ఆ తండ్రి కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా గాంగ్టాంగ్ తన కొడుకుని ఎత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విధంగా తనకు కొడుకు కోసం ఆ తండ్రి చేసిన సాహసం తెలుసుకున్న నెటిజన్లు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…