స్విస్ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లె అప్పట్లో మ్యాగీ నూడుల్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ నూడుల్స్లో పరిమితికి మించి సీసం కలుస్తుందన్న కారణంతో ఆ సంస్థ తయారు చేసే మాగీ నూడుల్స్పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. తరువాత మళ్లీ అడ్డంకులను తొలగించుకుని యథావిధిగా నూడుల్స్ అమ్మకాలను ప్రారంభించింది. కానీ తాజాగా మరో షాకింగ్ విషయం తెలిసింది.
మాగీ నూడుల్స్ ఉత్పత్తిదారు నెస్లే తన ఉత్పత్తుల్లో 60 శాతం ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవి కావని అంగీకరించినట్లు తెలిసింది. ఆరోగ్యకరమైనవి అనే నిర్వచనాన్ని అందుకోవడానికి నెస్లె యత్నించినా ఆ ప్రయత్నంలో ఆ సంస్థ విఫలమైంది. ఆ విషయాన్ని నెస్లె స్వయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రజలకు పౌష్టికాహారంతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు నెస్లె నడుం బిగించింది. అందులో భాగంగానే తన ఉత్పత్తులను కూలంకషంగా పరిశీలిస్తోంది. ఆ క్రమంలోనే నెస్లె తమ ఉత్పత్తుల్లో చాలా వరకు అనారోగ్యకరమైనవే ఉన్నాయని సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
నెస్లెకు చెందిన మెయిన్స్ట్రీమ్ ఫుడ్, డ్రింక్స్ పోర్ట్ఫోలియో హెల్త్, న్యూట్రిషన్ ప్రమాణాలను పాటించడంలో విఫలమైందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఆహార ఉత్పత్తుల కంపెనీ నెస్లె ఉత్పత్తుల్లో 60 శాతానికి పైగా ఉత్పత్తులు ఆరోగ్యకరంగా లేవని తెలిపింది. ఇక ఆస్ట్రేలియాలో నెస్లెకు చెందిన ఉత్పత్తులకు 3.5 రేటింగ్ ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయంపై తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తామని నెస్లె తెలిపింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…