Indian Railways : రైళ్లలో ప్రయాణించేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాటిని డిస్పోజబుల్ పద్ధతిలో ఇస్తారు.
ఇకపై రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను అందించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ముందస్తుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డిస్పోజబుల్ దుప్పట్లు, దిండ్లను ఇస్తారు. మొత్తం ఒక కిట్ రూపంలో వాటిని అందిస్తారు.
రైల్వే శాఖ అందించే కిట్లో దుప్పట్లు, దిండుతోపాటు పలు వస్తువులు కూడా ఉంటాయి. ఒక తెలుగు రంగు బెడ్ షీట్, ఒక గ్రే కలర్ బ్లాంకెట్, ఒక దిండు, దిండు కవర్, నాప్ కిన్, మూడు లేయర్లు ఉండే మాస్క్, టూత్ పేస్ట్ వంటివి ఉంటాయి. ప్రయాణికులు రూ.150 చెల్లించి ఈ కిట్ను పొంది అందులో ఉండే వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణం ముగిశాక వాటిని పడేయాలి. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన రైళ్లలోనే ఉంది. కానీ త్వరలోనే మిగిలిన అన్ని రైళ్లలోనూ ఈ సదుపాయాన్ని అందివ్వనున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…