సీరం ఇన్‌స్టిట్యూట్‌ సంచలన ప్రకటన..భారీగా తగ్గించిన కోవిషీల్డ్‌ ధర..!

April 29, 2021 11:17 PM

భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్నటువంటి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోసు ప్రభుత్వానికి రూ.400 ల ధర నిర్ణయించగా, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.600 నిర్ణయించినట్లు ఇదివరకే ప్రకటించింది.

తాజాగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా  టీకా ధరల విషయంలో 25% తగ్గిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి అందిస్తున్న ఒక్కో డోసును రూ.400కు విక్రయిస్తుండగా.. ఆ ధరను రూ.300కు తగ్గిస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. తగ్గించిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న ఈ విపత్కరమైన పరిస్థితులలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్రాలకు కొన్ని వేల కోట్లలో ఆదాయం లభిస్తుందని, మరికొంతమందికి వ్యాక్సిన్ అందించడానికి వెసులుబాటు ఉంటుందని అదర్‌ పూనావాలా  వెల్లడించారు. అయితే కేవలం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాలకు మాత్రమే ఈ ధరలను తగ్గించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment