భారత్లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్లను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టాలని ప్రధాని మోదీకి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశీ వైద్య నిపుణులు కూడా భారత్లో కఠిన లాక్డౌన్ అమలు చేయడం ఒక్కటే మార్గమని ఇప్పటికే సూచించారు. ఇక తాజాగా కోవిడ్ పరిస్థితిని సమీక్షించడం కోసం జాతీయ స్థాయిలో నియమింపబడ్డ టాస్క్ ఫోర్స్ సభ్యులు కూడా దేశంలో లాక్డౌన్ పెట్టాలని మోదీకి సూచించారు.
దేశంలో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవడం, కోవిడ్ నియంత్రణ వ్యూహాలను పర్యవేక్షించే నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వాక్సినేషన్ (ఎన్ఈజీవీఏసీ) దేశంలో మరోమారు లాక్డౌన్ పెట్టాలని మోదీకి సూచించింది. ఈ టాస్క్ఫోర్స్కు చైర్మన్ గా ఉన్న డాక్టర్ వీకే పాల్ నేరుగా ప్రధాని మోదీకి నివేదిస్తారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున దేశంలో మరోమారు లాక్డౌన్ పెట్టాలని ఆయన మోదీకి సూచించారు.
అయితే ఇటీవల సీఎంలతో నిర్వహించిన సమావేశం అనంతరం దేశంలో లాక్ డౌన్ ఉండదని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసినట్లు చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలను పాటించడం, టీకాలను తీసుకోవడం ఒక్కటే మన ముందున్న మార్గమని, లాక్డౌన్ అనేది చివరి స్టెప్ అని స్పష్టం చేశారు. కానీ దేశంలో పరిస్థితి చూస్తే రోజు రోజుకీ దిగజారిపోతోంది. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ సూచించిన మేర మోదీ లాక్డౌన్పై పునరాలోచన చేస్తారా, లేదా, అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…