భారత్లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్లను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టాలని ప్రధాని మోదీకి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశీ వైద్య నిపుణులు కూడా భారత్లో కఠిన లాక్డౌన్ అమలు చేయడం ఒక్కటే మార్గమని ఇప్పటికే సూచించారు. ఇక తాజాగా కోవిడ్ పరిస్థితిని సమీక్షించడం కోసం జాతీయ స్థాయిలో నియమింపబడ్డ టాస్క్ ఫోర్స్ సభ్యులు కూడా దేశంలో లాక్డౌన్ పెట్టాలని మోదీకి సూచించారు.
దేశంలో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవడం, కోవిడ్ నియంత్రణ వ్యూహాలను పర్యవేక్షించే నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వాక్సినేషన్ (ఎన్ఈజీవీఏసీ) దేశంలో మరోమారు లాక్డౌన్ పెట్టాలని మోదీకి సూచించింది. ఈ టాస్క్ఫోర్స్కు చైర్మన్ గా ఉన్న డాక్టర్ వీకే పాల్ నేరుగా ప్రధాని మోదీకి నివేదిస్తారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున దేశంలో మరోమారు లాక్డౌన్ పెట్టాలని ఆయన మోదీకి సూచించారు.
అయితే ఇటీవల సీఎంలతో నిర్వహించిన సమావేశం అనంతరం దేశంలో లాక్ డౌన్ ఉండదని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసినట్లు చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలను పాటించడం, టీకాలను తీసుకోవడం ఒక్కటే మన ముందున్న మార్గమని, లాక్డౌన్ అనేది చివరి స్టెప్ అని స్పష్టం చేశారు. కానీ దేశంలో పరిస్థితి చూస్తే రోజు రోజుకీ దిగజారిపోతోంది. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ సూచించిన మేర మోదీ లాక్డౌన్పై పునరాలోచన చేస్తారా, లేదా, అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…