భారత్లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్లను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టాలని ప్రధాని మోదీకి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశీ వైద్య నిపుణులు కూడా భారత్లో కఠిన లాక్డౌన్ అమలు చేయడం ఒక్కటే మార్గమని ఇప్పటికే సూచించారు. ఇక తాజాగా కోవిడ్ పరిస్థితిని సమీక్షించడం కోసం జాతీయ స్థాయిలో నియమింపబడ్డ టాస్క్ ఫోర్స్ సభ్యులు కూడా దేశంలో లాక్డౌన్ పెట్టాలని మోదీకి సూచించారు.
దేశంలో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవడం, కోవిడ్ నియంత్రణ వ్యూహాలను పర్యవేక్షించే నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వాక్సినేషన్ (ఎన్ఈజీవీఏసీ) దేశంలో మరోమారు లాక్డౌన్ పెట్టాలని మోదీకి సూచించింది. ఈ టాస్క్ఫోర్స్కు చైర్మన్ గా ఉన్న డాక్టర్ వీకే పాల్ నేరుగా ప్రధాని మోదీకి నివేదిస్తారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున దేశంలో మరోమారు లాక్డౌన్ పెట్టాలని ఆయన మోదీకి సూచించారు.
అయితే ఇటీవల సీఎంలతో నిర్వహించిన సమావేశం అనంతరం దేశంలో లాక్ డౌన్ ఉండదని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసినట్లు చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలను పాటించడం, టీకాలను తీసుకోవడం ఒక్కటే మన ముందున్న మార్గమని, లాక్డౌన్ అనేది చివరి స్టెప్ అని స్పష్టం చేశారు. కానీ దేశంలో పరిస్థితి చూస్తే రోజు రోజుకీ దిగజారిపోతోంది. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ సూచించిన మేర మోదీ లాక్డౌన్పై పునరాలోచన చేస్తారా, లేదా, అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…