మే 8న అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటారు. కానీ ఈ మాతృ దినోత్సవం రోజున ఓ తల్లికి ఎంతో అవమానం జరిగింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో తెలిసిందే. ఈ క్రమంలోనే రాజస్థాన్లోని ఝహల్వార్లో ఓ మహిళ కరోనా బారిన పడింది.
ఈమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మాతృ దినోత్సవం రోజున మరణించింది.అయితే ఈమెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి ఆస్పత్రి అధికారులు నిరాకరించారు.ఆ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆ తల్లి కొడుకులు, బంధువులు ఎంత వేడుకున్నా అధికారుల మనసు కరగలేదు.
ఈ క్రమంలోనే గ్రామస్తులు కూడా తన తల్లి అంతిమ సంస్కారాలకు సహకరించకపోవడంతో చేసేదేమీ లేక ఆ తల్లి పిల్లలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే తోపుడు బండిపై తన తల్లి శవాన్ని ఉంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశాన వాటికకు ఆ తల్లి మృతదేహాన్ని తోపుడు బండి పైన తీసుకెళ్లి దహన సంస్కరణలు నిర్వహించారు. ఈ విధంగా మాతృ దినోత్సవం రోజునే ఈ తల్లికి ఎంతో అవమానం జరిగింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…