బాలీవుడ్ నటి అమృతా రావు సినీ ఇండస్ట్రీలో ఉన్న పురుషాధిక్యతపై కామెంట్లు చేసింది. సినీ రంగంలో నటీమణులు వివక్షను ఎదుర్కొంటారని తెలిపింది. ఆడవాళ్లు కావడం వల్లే వారి సినీ కెరీర్పై ప్రభావం పడుతుందని, మగ యాక్టర్ల కెరీర్పై పెళ్లి ఎలాంటి ప్రభావం చూపిందని ఆమె పేర్కొంది. మగ యాక్టర్లు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా వారు యంగ్ హీరోయిన్లతో సినిమాల్లో రొమాన్స్ చేస్తారని చెప్పింది.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమృతారావు మాట్లాడుతూ సినీ రంగంలో పురుషులకు ఏమీ కాదని, కానీ స్త్రీలపై పెళ్లి ప్రభావం చూపిస్తుందని, పురుషులు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నా యువ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారని, కానీ స్త్రీలకు కెరీర్ ముగిసిపోతుందని అభిప్రాయపడింది. ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపింది.
1950 నుంచి ఇప్పటి వరకు ఈ విధమైన ట్రెండ్ కొనసాగుతుందని అమృతా రావు తెలియజేసింది. కాగా అమృత చివరిసారిగా థాకరే అనే మూవీలో మీనా అనే పాత్రలో నవాజుద్దీన్ సిద్దికీ తో కలిసి నటించింది. 2019లో ఆ మూవీ విడుదలైంది. బాల్ థాకరే జీవిత చరిత్ర ఆధారంగా ఆ మూవీని తీశారు. అమృత 2016లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అన్మోల్ సూద్ను వివాహం చేసుకుంది. అతను ఆర్జే అన్మోల్గా అందరికీ పరిచయమే. వారికి గతేడాది నవంబర్ లో బాబు జన్మించాడు. అతనికి వీర్ అని నామకరణం చేశారు. తెలుగులో అమృత హీరో మహేష్తో కలిసి అతిథి మూవీలో నటించింది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…