చదువు చదివేందుకు వయస్సుతో పనిలేదు. ఏ వయస్సులో అయినా ఏ కోర్సు అయినా చదవవచ్చు. ఈ విషయాన్ని గతంలో ఎంతో మంది నిరూపించారు. ఇప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని చాటి చెప్పారు. ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే పూర్ణ చంద్ర స్వెయిన్ ఎట్టకేలకు 10 తరగతి పరీక్షల్లో పాస్ అయ్యారు. ఆయన వయస్సు 49 ఏళ్లు.
ఒడిశాలోని అధికార బిజు జనతా దళ్ పార్టీకి చెందిన సురద ఎమ్మెల్యే పూర్ణ చంద్ర ఆ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామ్ 10వ తరగతిలో బి2 గ్రేడ్ సాధించి పాస్ అయ్యారు. మొత్తం 500 మార్కులకు గాను ఆయన 340 మార్కులను సాధించడం విశేషం. అక్కడి గంజామ్ జిల్లాలో ఉన్న సురదలోని ఎస్బీ హై స్కూల్లో ఆయన పరీక్ష రాశారు.
ఇక 10వ తరగతిలో ఆయన మార్కుల విషయానికి వస్తే పెయింటింగ్ లో 85, ఇంగ్లిష్లో 44, సైన్స్లో 83, సోషల్లో 61, ఒడియాలో 67 మార్కులను సాధించారు. ఒక్కో సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులను కేటాయించారు. అయితే ఆయన పెయింటింగ్లో ఎక్కువ మార్కులను సాధించడం విశేషం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…