నటుడు, సంఘ సేవకుడు సోనూసూద్కు ఐటీ విభాగం షాకిచ్చింది. సోనూసూద్కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో బుధవారం ఐటీ విభాగం అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ముంబైలో ఉన్న ఆయన ఇళ్లతోపాటు లక్నోలోని కంపెనీ కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేశారు.
కాగా నటుడు సోనూసూద్ను ఇటీవలే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తమ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. అక్కడి ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రోత్సహించేందుకు గాను సోనూ సూద్ను సీఎం కేజ్రీవాల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అయితే సోనూసూద్.. కేజ్రీవాల్తో సమావేశం అయిన అనంతరం పాలిటిక్స్ లో చేరుతున్నారా ? అని సోనూను మీడియా ప్రశ్నించింది. కానీ ఆయన ఆ వార్తలను కొట్టి పారేశారు. ఓ సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే ఆ విధంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్తో చర్చించానని తెలిపారు.
అయితే ఆ మీటింగ్ అనంతరం సోనూసూద్కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్కమ్ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి సోనూ సూద్ పనిచేస్తారన్న వార్తల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులను చేయిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని ఖండించారు.
ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ప్రత్యేకమైనదని, ఒక వ్యక్తి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా ఐటీ చట్టం ప్రకారం పన్ను కట్టకపోతే ఇబ్బందులు తప్పవని, అందువల్ల దానికి, ఐటీకి ముడి పెట్టవద్దని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఏది ఏమైనా సోనూ సూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…