కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. దేశంలో అందరికీ కోవిడ్ టీకాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకాలను అందిస్తుందని, కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాలు పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదని మోదీ అన్నారు.
కరోనా నేపథ్యంలో సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని, టీకాల కోసం ఎవరూ ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజలందరికీ టీకాలు వేసే బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
నవంబర్ వరకు దేశంలోని 80 కోట్ల మందికి టీకాలు వేస్తామని మోదీ అన్నారు. కోవిడ్ టీకాల పట్ల ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని, టీకాలు తీసుకునేందుకు ఎవరూ భయ పడాల్సిన పనిలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవాలన్నారు. టీకాలపై ఇతరులకు ఉండే అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కోవిడ్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో అందరం విజయం సాధిస్తామని, భారత్ కోవిడ్ పై విజయం సాధిస్తుందని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…