కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. దేశంలో అందరికీ కోవిడ్ టీకాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకాలను అందిస్తుందని, కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాలు పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదని మోదీ అన్నారు.
కరోనా నేపథ్యంలో సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని, టీకాల కోసం ఎవరూ ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజలందరికీ టీకాలు వేసే బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
నవంబర్ వరకు దేశంలోని 80 కోట్ల మందికి టీకాలు వేస్తామని మోదీ అన్నారు. కోవిడ్ టీకాల పట్ల ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని, టీకాలు తీసుకునేందుకు ఎవరూ భయ పడాల్సిన పనిలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవాలన్నారు. టీకాలపై ఇతరులకు ఉండే అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కోవిడ్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో అందరం విజయం సాధిస్తామని, భారత్ కోవిడ్ పై విజయం సాధిస్తుందని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…