ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి దాటికి ఎంతో మంది బలయ్యారు. ఈ క్రమంలోనే కరోనాతో మృతి చెందిన వారిని సొంత వాళ్లు కూడా తాకడానికి వెనుకడుగు వేస్తున్న సమయంలో ఎంతోమందికి అయిన వాళ్లల, ఆప్త మిత్రుడిలా, కన్న కొడుకులా దగ్గరుండి సుమారు మూడు వందల ముప్పై కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఓ మనసున్న మారాజు చివరికి ఆ మహమ్మారి బారిన పడి తనువు చాలించిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజమహేంద్రవరం మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మూరుకు చెందిన మల్లిపూడి మణికంఠ,భరత్ రాఘవ అనే ఇద్దరు యువకులు కరోనాతో మరణించిన మృతదేహాలకు వారి దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించే వారు. ఈ క్రమంలోనే భరత్, మణికంఠ ఇద్దరూ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే విశాఖపట్నం కేజీహెచ్లో కోవిడ్ చికిత్స పొందుతూ సోమవారం మణికంఠ మృతి చెందాడు. మణికంఠతో కలిసి భరత్ రాఘవ ఇప్పటి వరకు 330 సొంత డబ్బులతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే స్నేహితుడు మరణం పై భరత్ మాట్లాడుతూ.. మా ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కరణలు నిర్వహించాము. ఈ క్రమంలోనే తన స్నేహితుడు మణికంఠ కరోనా బారినపడి మృతి చెందాడని తాను ప్రస్తుతం మహమ్మారి నుంచి కోలుకుని తిరిగి తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…