ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలామంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెడుతూ నెలకు వేలల్లో లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నారు. ఈ విధంగా రోజు కూలి పనులకు వెళ్లే ఓ సాధారణ వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలబ్రిటీగా మారిపోయాడు. ఎన్నో యూట్యూబ్ చానల్స్ ఉన్నప్పటికీ అందులోనూ వంటలకు ఎన్నో ఛానల్ లో ఉన్నప్పటికీ “విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ”కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.
విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ద్వారా చేసే వంటకాలు కేవలం చూడటానికి మాత్రమే కాకుండా ఆ రుచిని ఆస్వాదించి చేసేలా. ఏకంగా వందల కిలోల కొద్దీ మాంసాహారాలను, వందల కొద్ది గుడ్లతో వివిధ రకాల వంటకాలను వివిధ ప్రదేశాలలో తయారుచేస్తూ ఎంతోమంది సబ్స్క్రైబర్లు దక్కించుకుంది.విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ కి ఏకంగా నలభై నాలుగు లక్షల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు అంటే ఈ ఛానల్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది.
విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ద్వారా 65 సంవత్సరాలు ఆర్ముగం అనే వ్యక్తి చేసే వంటకాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇతను తయారు చేసే వంటలకు కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులు ఉన్నారు.ఒకేసారి 2500 కోడిగుడ్లతో పులుసు, 250 బాతుగుడ్లతో వేపుడు, వెయ్యి కోడి గుండెలతో గ్రేవీ కర్రీ, రెండడుగుల వ్యాసం కలిగిన ఆమ్లెట్… ఇలా డాడీ ఆర్ముగం వంటలన్నీ భారీగా తయారుచేయడం ఈ ఛానల్ ప్రత్యేకత.
ఒకప్పుడు రోజు కూలీ కోసం పనిచేసుకునే ఇతను తన కొడుకు సహాయంతో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది సబ్స్క్రైబర్లు సంపాదించుకొని నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన నెలలో 7000 సంపాదించగా, తరువాత నెలలో 40000, ఆ తర్వాత ఏకంగా మూడు లక్షల ఆదాయాన్ని పొందారు. ఒకప్పుడు ఉండటానికి కూడా సొంత ఇల్లు లేని ఆర్ముగం ప్రస్తుతం 50 లక్షల రూపాయల ఇంటిలో నివసిస్తున్నాడు. అదేవిధంగా మదురైలో రెండు హోటళ్లను నిర్వహిస్తూ,స్కార్పియో, నిసాన్ సన్నీ వాహనాలకూ యజమాని అయ్యాడు.విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేయడమే కాకుండా అంత పెద్ద మొత్తంలో తయారు చేసిన ఆహార పదార్థాలను దగ్గరలో ఉన్న అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు పంపించడం ఈ ఛానల్ ప్రత్యేకత. ఏది ఏమైనా అతి తక్కువ సమయంలోనే ఇంతలా సంపాదించడం అంటే ఎంతో గ్రేట్ అని చెప్పవచ్చు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…