దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ 3వ దశ కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లను ఇస్తున్నారు. అయితే చాలా మంది భయంతో కోవిడ్ టీకాలను వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయి. అయితే ప్రజల్లో వ్యాక్సిన్ల పట్ల అవగాహన కల్పించేందుకు, వారిని టీకాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ వినూత్న స్కీమ్ను ప్రకటించింది.
కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకునేవారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ఆఫర్ను అందిస్తోంది. టీకాలను తీసుకునే వారు ఆ బ్యాంకులో ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్లో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానిపై 25 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీని అందిస్తారు. ఆ బ్యాంకు తాజాగా ఈ స్కీమ్ను అందిస్తున్నట్లు తెలిపింది. దీన్ని పరిమిత కాలపు ఆఫర్గా ఆ బ్యాంకు తెలిపింది. అందువల్ల కోవిడ్ టీకాలు తీసుకునే వారు ఫిక్స్డ్ డిపాజిట్ వేసే ఆలోచన ఉంటే ఆ బ్యాంకులో ఎఫ్డీ వేయవచ్చు. దీంతో అదనపు వడ్డీ లభిస్తుంది.
ఇక ఆ ఎఫ్డీ కింద వినియోగదారులు కనీసం 1,111 రోజుల పాటు అయినా డబ్బును డిపాజిట్ చేయాలి. అప్పుడే అదనపు వడ్డీ లభిస్తుంది. దేశంలో కోవిడ్ టీకాలను తీసుకునేందుకు చాలా మంది సందేహిస్తున్న నేపథ్యంలో టీకాలను తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకే ఆ బ్యాంకు ఈ స్కీమ్ను ప్రకటించింది. మరి దీని కింద ఎంత మంది ఎఫ్డీలను వేస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…