సమాజంలో మనుషులులో ఉండాల్సిన మానవత్వం రోజురోజుకు దిగజారిపోతుంది. సాటి మనుషుల పట్ల మూగజీవాల పట్ల ఎంతో ఉదార స్వభావాన్ని చాటు కోవాల్సిన మనుషులు రోజురోజుకు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక, హసన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నోరులేని 50 కోతులకు ఆహారంలో విషమిచ్చి చంపిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
కర్ణాటక, హసన్ జిల్లాలో చౌడనహళ్లి సమీపంలోని ఓ రోడ్డు సమీపంలోని గ్రామస్తులు ఒక గోనెసంచి పడి ఉండటం గమనించారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు వెళ్లి ఆ గోనె సంచిని తెరిచి చూడగా అందులో కోతులు విగతజీవులుగా కనిపించాయి. ఈ క్రమంలోనే గ్రామస్తులు వాటిని బయటికి తీయడంతో సుమారు 50 కోతులు ఒకే సంచిలో ఉండటం వల్ల ఊపిరాడక వీటిలో 38 కోతులు ప్రాణాలను కోల్పోయాయి. మరికొన్ని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు చనిపోయిన కోతులను పోస్టుమార్టానికి తరలించారు దీంతో వాటిపై విష ప్రయోగం జరగడం వల్ల చనిపోయాయని గుర్తించారు. అదేవిధంగా వాటిని ఒక సంచిలో వేసి ఘోరంగా కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నటువంటి బేలూర్, సక్లేష్ పూర్లో చాలా కోతులున్నా వాటికి వచ్చే నష్టమేమీ కలగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.అయితే ఈ ప్రాంతంలో చనిపోయిన కోతులు ఈ ప్రాంతానికి చెందినవి కాదని, ఎక్కడో చనిపోవటం వల్ల తీసుకువచ్చి ఇక్కడ వేసి ఉంటారని అధికారులు భావించారు.ప్రస్తుతం కోతులకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో తెలియడంతో పలువురు జంతు ప్రేమికులు నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…