India vs Newzealand : కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసే దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 258 పరుగుల స్కోరు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేయగా, శుబమన్ గిల్ 93 బంతులు ఆడి 5 ఫోర్లు, 1 సిక్సర్తో 52 పరుగులు చేశాడు.
చటేశ్వర్ పుజారా 88 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేయగా, కెప్టెన్ రహానే 63 బంతులు ఆడి 6 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం క్రీజులో అయ్యర్ 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగుల స్కోరు వద్ద ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా 100 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతున్నాడు. కివీస్ బౌలర్లలో కైలీ జేమిసన్ 3 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌతీకి 1 వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…