India Corona : కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో రోజు రోజుకీ తగ్గుతోంది. దీంతో కొత్తగా నమోదవుతున్న కేసులతోపాటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. ఈ క్రమంలోనే తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 1 లక్ష దిగువకు చేరుకుంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. అయితే కరోనా రెండో వేవ్ ప్రభావం తగ్గుతున్నప్పటికీ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. మళ్లీ కోవిడ్ ఆంక్షలను అమలు చేసే దిశగా రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి.
ఇక మంగళవారం దేశవ్యాప్తంగా 11,08,467 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 8,954 మందికి వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయింది. 10,207 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దిగువగా.. 99,023 వద్ద ఉంది.
దేశవ్యాప్తంగా 3.45 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 3.40 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. గతేడాది మార్చి నుంచి ఇదే అత్యధికం కావడం విశేషం. 24 గంటల వ్యవధిలో 267 మంది కోవిడ్తో చనిపోయారు. కేరళలో 177 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 4,69,247కు చేరుకుంది. మంగళవారం 80,98,716 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 124 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…