IND Vs ZIM : హరారే వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాట్స్మెన్ విలవిలలాడిపోయారు. ఈ క్రమంలోనే ఆ జట్టు తక్కువ స్కోర్కే చాప చుట్టేసింది. దీంతో ఆ లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. వికెట్ నష్టపోకుండా భారత బ్యాట్స్మెన్ లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో జింబాబ్వేపై భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే జింబాబ్వే జట్టు 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో బ్రాడ్ ఇవాన్స్ (33 నాటౌట్), రిచర్డ్ ఎన్గరవ (34) తప్ప ఎవరూ రాణించలేదు. ఇక భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్లు తలా 3 వికెట్లను పడగొట్టారు. అలాగే మహమ్మద్ సిరాజ్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే వికెట్ కూడా నష్టపోకుండా 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 192 పరుగులు చేసి విజయం సాధించింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబమన్ గిల్లు జింబాబ్వే బౌలర్లను పరుగెత్తించారు. బౌండరీల మీద బౌండరీలను బాదారు. దీంతో శిఖర్ ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా.. 72 బంతుల్లో శుబమన్ గిల్ 10 ఫోర్లు, 1 సిక్సర్తో 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లు భారత బ్యాట్స్మెన్పై ఏమాత్రం ప్రభావం చూపించలేపోయారు. భారత్ నుంచి వచ్చిన లిస్ట్ ఎ ప్లేయర్లతోనూ జింబాబ్వే ఆడి గెలవలేకపోయింది. ఇక తొలి వన్డే మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో రెండో వన్డే ఇదే వేదికపై ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభం కానుంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…