Idhe Maa Katha : గురు పవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, తాన్య శ్రీకాంత్, భూమికా చావ్లా, హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఇదే మా కథ. శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం గురించి హీరో సుమంత్ అశ్విన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వీరందరూ ఎక్కడ కలుస్తున్నారు ? అసలు ఈ సినిమా కథ ఏంటి ? అనే విషయం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుందని సుమంత్ తెలిపారు. అయితే ఇందులో భూమిక గురించి సుమంత్ ఎన్నో విషయాలను తెలియజేశారు. భూమికను చిన్నప్పుడు ఒకసారి ఫిలింఛాంబర్లో చూసి ఈ హీరోయిన్ ఎంతో అందంగా ఉందని భావించాను. ఆ తరువాత ఒక్కడు సినిమా సెట్ లో తనతో కలిసి పని చేయడం ఎంతో హ్యాపీగా అనిపించిందని సుమంత్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సినిమాలో భాగంగా చివరి 20 నిమిషాలు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని తెలిపారు. చివరిలో మంచుపై బైక్ రైడ్ చేయాల్సి ఉంటుందని, ఇలా బైక్ రైడ్ చేసేటప్పుడు తనలో కొద్దిగా భయం అనేది ఏర్పడిందని సుమంత్ తెలిపారు. ముఖ్యంగా ఈ స్నో జర్నీలో భూమిక తన బైక్ పై ఎక్కినపుడు తాను ఎంతో హడలిపోయానని, ఎంతో రిస్కీ సన్నివేశంలో తను నటించాల్సిన అవసరం లేదని, ఆ సన్నివేశంలో డూప్ ని కూడా పెట్టవచ్చని, కానీ ఆ సన్నివేశం రియాలిటీగా ఉండడం కోసం భూమిక ఎంతో సాహసం చేశారని, ఆ సమయంలో తనని చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని.. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…