ICC Under 19 World Cup 2022 : అండర్-19 క్రికెట్లో భారత్ సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్ అండర్-19 జట్టు ఈసారి కూడా కప్ కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే సెమీస్ చేరుకున్న భారత్ బుధవారం సాయంత్రం ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో తలపడనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత రెండు అండర్ 19 వరల్డ్ కప్లలో భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండు సార్లు నాకౌట్ మ్యాచ్లలో తలపడ్డాయి. అయితే రెండు సార్లూ భారత జట్టే గెలిచింది. దీంతో భారత్ ఫేవరెట్గా ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. 2018 అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో పృథ్వీ షా కెప్టెన్సీలోని భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. ఇక 2020లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లోనూ ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. దీంతో బుధవారం జరగనున్న మ్యాచ్లోనూ ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధిస్తుందని అంటున్నారు.
ఇక ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే వరుసగా నాలుగోసారి వరల్డ్ కప్ ఫైనల్స్లోకి ప్రవేశించినట్లు అవుతుంది. ఈ క్రమంలోనే భారత్, ఆస్ట్రేలియాల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2022 మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ చానల్స్లో ప్రసారం అవుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం సాయంత్రం 6.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…