Hyper Aadi : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నూతన కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ కోవకు చెందినవాడే హైపర్ ఆది.
సరైన టైమింగ్ లో పంచ్ డైలాగులు వేస్తూ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో హైపర్ ఆది కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రోమో ఒకటి విడుదలైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షోలో హైపర్ ఆది, ఇమాన్యుయేల్, ఆటో రాంప్రసాద్ వంటి వారు తమ స్కిట్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఈ షో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది.
అసలు విషయానికి వెళ్తే తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ షో మాదిరిగా ఒక టేబుల్ పై కంటెస్టెంట్స్ ఫోటోలు పెట్టారు. యాంకర్ రష్మి తమకు నచ్చని వారి ఫోటోలను కాల్చేయడం లేదా చింపేయడం చేయడం లాంటివి చేయాలి అంటూ చెప్పింది. ముందుగా ఆటో రాంప్రసాద్ టేబుల్ వద్దకు ఎంట్రీ ఇచ్చి హైపర్ ఆది వలన నేను ఒక విషయంలో పర్సనల్ గా హర్ట్ అయ్యాను, సారీ ఆది అంటూ రాంప్రసాద్ ఆది ఫోటోను కాల్చేస్తాడు.
ఆ తర్వాత పరదేశి వచ్చి నాకు అన్నీ హైపర్ ఆది అని చెబుతాను కానీ ఒక రీజన్ వలన ఇలా చేయవలసి వస్తోంది అంటూ ఆది ఫోటోను చింపేస్తాడు. ఇక రష్మీ కూడా హైపర్ ఆది ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫోటోను చింపేస్తుంది. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆది.. రష్మీ ఎప్పుడు వచ్చావు అని అడగకుండా, ఎప్పుడు వెళ్తావు అని అడిగాడు. నాకు ఈ విషయం నచ్చలేదు అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. దీంతో ఆది కంటతడి పెట్టుకుంటాడు.
ఈ ప్రోమో లో హైపర్ ఆది టేబుల్ వద్దకు ఎంట్రీ ఇచ్చి ఒకరి ఫోటోని చేత్తో పట్టుకుంటాడు. ఆది పట్టుకున్న ఫోటో ఎవరిదో తెలియాలి అంటే ఎపిసోడ్ మొత్తం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు సైతం డైరెక్టర్ షో ను హైలెట్ చేయడానికి బాగానే ప్లాన్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…