Hyper Aadi : ఎప్పుడూ న‌వ్వించే హైప‌ర్ ఆది.. కంట‌త‌డి పెట్టుకున్నాడు.. కార‌ణం ఏమిటంటే..

August 12, 2022 5:34 PM

Hyper Aadi : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నూతన కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ కోవకు చెందినవాడే హైపర్ ఆది.

సరైన టైమింగ్ లో పంచ్ డైలాగులు వేస్తూ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో హైపర్ ఆది కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రోమో ఒకటి విడుదలైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షోలో హైపర్ ఆది, ఇమాన్యుయేల్, ఆటో రాంప్రసాద్  వంటి వారు తమ స్కిట్స్ తో  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఈ షో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది.

Hyper Aadi got emotional on stage know what is the reason
Hyper Aadi

అసలు విషయానికి వెళ్తే తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ షో మాదిరిగా ఒక టేబుల్ పై కంటెస్టెంట్స్ ఫోటోలు పెట్టారు. యాంకర్ రష్మి తమకు నచ్చని వారి ఫోటోలను కాల్చేయడం లేదా చింపేయడం చేయడం లాంటివి చేయాలి అంటూ చెప్పింది. ముందుగా ఆటో రాంప్రసాద్ టేబుల్ వద్దకు ఎంట్రీ ఇచ్చి హైపర్ ఆది వలన నేను ఒక విషయంలో పర్సనల్ గా హర్ట్ అయ్యాను, సారీ ఆది అంటూ రాంప్రసాద్ ఆది ఫోటోను కాల్చేస్తాడు.

ఆ తర్వాత పరదేశి వచ్చి నాకు అన్నీ హైపర్ ఆది అని చెబుతాను కానీ ఒక రీజన్ వలన ఇలా చేయవలసి వస్తోంది అంటూ ఆది ఫోటోను చింపేస్తాడు. ఇక రష్మీ కూడా హైపర్ ఆది ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫోటోను చింపేస్తుంది. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆది.. రష్మీ ఎప్పుడు వచ్చావు అని అడగకుండా, ఎప్పుడు వెళ్తావు అని అడిగాడు. నాకు ఈ విషయం నచ్చలేదు అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. దీంతో ఆది కంటతడి పెట్టుకుంటాడు.

ఈ ప్రోమో లో హైపర్ ఆది టేబుల్ వద్దకు ఎంట్రీ ఇచ్చి ఒకరి ఫోటోని చేత్తో పట్టుకుంటాడు. ఆది పట్టుకున్న ఫోటో ఎవరిదో తెలియాలి అంటే ఎపిసోడ్ మొత్తం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజన్లు సైతం డైరెక్టర్ షో ను హైలెట్ చేయడానికి బాగానే ప్లాన్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment