Huzurabad : హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. తన సమీప తెరాస పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై ఆయన 23వేల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత 6 నెలల నుంచి హుజురాబాద్లో బీజేపీ, తెరాసలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఉప ఎన్నికకు గాను ఓట్ల కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో మొదటి నుంచి ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. మొదటి రౌండ్ నుంచే ఈటల ఆధిక్యంలో కొనసాగారు. కేవలం రెండు రౌండ్లలోనే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ఈ క్రమంలోనే ఈటలకు భారీ మెజారిటీ లభించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమే అయ్యాయి.
దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ ఈటల గెలుస్తారని చెప్పారు. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్లో ఈటలకు 20వేలకు పైగా మెజారిటీ వస్తుందని అన్నారు. చెప్పినట్లుగానే అంతే మెజారిటీ రావడం విశేషం. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకుంటున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలకు 96,581 ఓట్లు పోలవ్వగా, గెల్లు శ్రీనివాస్కు 75,566 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బి.వెంకట్కు కేవలం 2767 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఈ ఉప ఎన్నికలో తెరాసకు పట్టు ఉన్న గ్రామాల్లోనూ బీజేపీ పైచేయి సాధించింది. ఓ దశలో తెరాస భారీ ఎత్తున ఓటుకు ఏకంగా రూ.10వేల వరకు పంచుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. కానీ గెలుపు అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. తెరాస డబ్బు, మద్యం పంచినా.. ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారని అన్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…