Hero : లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి సినీ వారసుడిగా వెంకటేష్ వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. నటన పరంగా ఎన్నో ఘన విజయాలను అందుకుని విక్టరీ హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు వెంకటేష్. ఆయన కెరీర్లో రాజా, గణేష్, సూర్యవంశం, కలిసుందాం రా.. వంటి ఎన్నో చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్నారు.
కానీ అందరూ మొదటిగా వెండితెరకు వెంకటేష్ పరిచయమైంది కలియుగ పాండవులు చిత్రంతో అని అనుకుంటారు. కలియుగ పాండవులు సినిమా వెంకటేష్ మొదటి సినిమా కాదు. ఈ సినిమా కన్నా ముందుగా వెంకటేష్ ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ప్రేమ్ నగర్ అనే సినిమాలో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.
ప్రేమ్ నగర్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించమని డి.రామానాయుడు.. వెంకటేష్ ను అడిగారట. ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే వెయ్యి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తానని రామానాయుడు వెంకటేష్ కు చెప్పడంతో వెంటనే సరే అని వెంకటేష్ ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత 1986 లో కలియుగ పాండవులు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా ఖుష్బూ నటించారు.
అయితే అప్పటిలో ఖుష్బూ తండ్రికి ఆమె తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ అప్పట్లో శ్రీదేవి, జయప్రద రాఘవేంద్ర రావు సినిమాలు చేస్తూ హిట్ ను అందుకున్నారు. అప్పటికే వీరు సీరియల్ హీరోస్ తో నటించడంతో యంగ్ హీరో వెంకటేష్ సరసన వీరు అంతగా బాగుండరు అనే ఉద్దేశంతో ఎలాగైనా ఖుష్బూతోనే కలియుగ పాండవులు అనే సినిమా చేయాలని అనుకున్నారు. 1986 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…