KGF : పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన కెజియఫ్ మొదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. అదేవిధంగా మొదటి భాగం కు సీక్వెల్ గా కెజియఫ్ 2 థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తమ సొంత రాష్ట్రం అయిన కర్ణాటకతోపాటు సౌత్ మరియు నార్త్ లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. కేజిఎఫ్ చిత్రంతో అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్ లకు కూడా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది.
ఈ చిత్రంలో హీరోకి తల్లిగా ఈ చిత్ర కథాంశానికి ఒక అమ్మాయి కీలక పాత్ర పోషించటం జరిగింది. ఈ సినిమాలో రాకీ భాయ్ కి తల్లిగా నటించిన అమ్మాయి ఎవరూ అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఆ అమ్మాయి పేరు అర్చన జోస్. ఆమె 1994లో బెంగళూరు లో జన్మించింది. అర్చన కర్ణాటకలోని బెంగళూరులో న్యూ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి, అదే పాఠశాలలో నాట్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ కథాకళి లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.
అర్చన జోస్ తమిళనాడులోని తంజావూరులో శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కూడా పూర్తి చేసింది. అర్చన మహాదేవి అనే కన్నడ సీరియల్ ద్వారా తొలిసారిగా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మహాదేవి సీరియల్ జీ కన్నడ లో ప్రసారం అయ్యేది. ఈ సీరియల్ లో ఆమె సుందరి పాత్రలో మెప్పించి నటన పరంగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తర్వాత అర్చన కన్నడ చిత్రం కెజియఫ్ లో హీరో యష్ కు తల్లిగా నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కెజియఫ్ చిత్రంతో వెండితెరపై పరిచయమైంది నటి అర్చన. 27 ఏళ్ళ అర్చన కెజియఫ్ లో హీరో యష్ తల్లిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కెజియఫ్ చిత్రం ద్వారా దేశ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి అర్చన జోస్.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…