Liger Cast Remuneration : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లైగర్ గురువారం గ్రాండ్ గా విడుదలైంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ డే మొత్తం కలెక్షన్లు 15 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా లైగర్ సినిమా 24.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన లైగర్ చిత్రం డిజాస్టర్ టాక్ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి విజయ్ దేవకొండ, రమ్యకృష్ణ, అనన్య పాండేలు తీసుకున్న పారితోషికం వివరాలు షాకిస్తున్నాయి. వారి రెమ్యూనరేషన్స్ ఒకసారి చూద్దాం.
లైగర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న విజయ్ దేవరకొండకి పూరీ ఏకంగా రూ.35 కోట్ల పారితోషికం ఇచ్చాడని సమాచారం. ఇది ఆర్ఆర్ఆర్ లో రామ్చరణ్, ఎన్టీఆర్ల పారితోషికంతో సమానమని చెప్పొచ్చు. ముందు నుంచి మైక్ టైసన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్తూ వచ్చారు. తీరా చూస్తే.. కామెడీ పీస్ అయ్యాడు. మైక్ టైసన్ కి ఈ మూవీ కోసం ఏకంగా రూ.40కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో మెరిసిన అనన్య పాండేకి రూ.3 కోట్లు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.
అనన్య పాండే హీరోయిన్ మెటీరియల్ కాదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. ఇక విజయ్ కి తల్లిగా నటించిన రమ్యకృష్ణకు ఈ పాత్రకి గాను కోటి రూపాయల పారితోషికం అందుకున్నారట. కోచ్గా కనిపించిన రోనిత్ రాయ్కి కోటిన్నర పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఇలా పారితోషికాలే వంద కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో లైగర్ టీం సభ్యులే క్లారిటీ ఇవ్వాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…