గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Liger Cast Remuneration : లైగర్ మూవీకి విజయ్, మైక్ టైసన్, రమ్యకృష్ణ, అనన్యపాండే ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

Liger Cast Remuneration : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లైగర్ గురువారం గ్రాండ్ గా విడుదలైంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల…

Liger Cast Remuneration : లైగర్ మూవీకి విజయ్, మైక్ టైసన్, రమ్యకృష్ణ, అనన్యపాండే ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

Liger Cast Remuneration : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లైగర్ గురువారం గ్రాండ్ గా విడుదలైంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్‌ డే మొత్తం కలెక్షన్లు 15 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా లైగర్‌ సినిమా 24.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన లైగర్‌ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్‌ అవుతోంది. భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీకి విజయ్‌ దేవకొండ, రమ్యకృష్ణ, అనన్య పాండేలు తీసుకున్న పారితోషికం వివరాలు షాకిస్తున్నాయి. వారి రెమ్యూనరేషన్స్ ఒకసారి చూద్దాం.

do you know about Liger Cast Remuneration
Liger Cast Remuneration

లైగర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్‌ చేసుకున్న విజయ్‌ దేవరకొండకి పూరీ ఏకంగా రూ.35 కోట్ల పారితోషికం ఇచ్చాడ‌ని సమాచారం. ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల పారితోషికంతో సమానమని చెప్పొచ్చు. ముందు నుంచి మైక్‌ టైసన్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్తూ వచ్చారు. తీరా చూస్తే.. కామెడీ పీస్ అయ్యాడు. మైక్ టైసన్ కి ఈ మూవీ కోసం ఏకంగా రూ.40కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో మెరిసిన అనన్య పాండేకి రూ.3 కోట్లు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.

అన‌న్య పాండే హీరోయిన్‌ మెటీరియల్‌ కాదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. ఇక విజయ్ కి తల్లిగా నటించిన రమ్యకృష్ణకు ఈ పాత్రకి గాను కోటి రూపాయల‌ పారితోషికం అందుకున్నారట. కోచ్‌గా కనిపించిన రోనిత్‌ రాయ్‌కి కోటిన్నర పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఇలా పారితోషికాలే వంద కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో లైగర్ టీం సభ్యులే క్లారిటీ ఇవ్వాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి