Lottery : సమాజంలో మనం జీవించడం మాత్రమే కాదు, మన తోటి వారు జీవించేందుకు కూడా సహాయ పడాలి. ఎలాంటి స్వార్థం లేకుండా మనకు కలిగినంతలో పక్క వారికి సహాయం చేయాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఈ విధంగా చేసేవారు సమాజంలో చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ఆ బామ్మ ఒకరని చెప్పవచ్చు. తనకు లాటరీ తగిలితే అందులో సగం మొత్తాన్ని టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చి ఉదారతను చాటుకుంది. వివరాల్లోకి వెళితే..
అమెరికాకు చెందిన 86 ఏళ్ల మారియన్ ఫారెస్ట్ అనే వృద్ధురాలు ఇటీవల ఓ స్టోర్లో ఓ లాటరీ టిక్కెట్ను కొనుగోల చేసింది. అది తగిలితే మొదటి బహుమతి కింద 5 లక్షల డాలర్లను ఇస్తారు. అయితే ఆమెకు ఆ లాటరీలో 300 డాలర్లు వచ్చాయి. ఆమెకు తగిలిన లాటరీ మొత్తం చిన్నదే అయినప్పటికీ ఆమె అందులో సగం మొత్తాన్ని తనకు టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చింది.
ఈ క్రమంలోనే మారియన్ సదరు స్టోర్కు వెళ్లి తనకు వచ్చిన లాటరీలో సగాన్ని ఆ వ్యక్తికి ఇచ్చి అతన్ని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఆమె చేసిన పనికి అందరూ ఆమెను అభినందిస్తున్నారు. తగిలిన లాటరీ మొత్తం తక్కువే అయినా.. ఆ బామ్మ అందులో సగం మొత్తాన్ని ఆ టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…