Golden Fish : కచిడి.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే.. ఇక మగ చేపలు ఔషధాల తయారీలో ఖరీదైన వైన్ను శుభ్రం చేయడంతో పాటు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కచిడి చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. గోదావరి జిల్లాల్లో కనిపించే ఈ చేప మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ జాలరి పంట పండింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రతీరంలో ఉప్పాడకు చెందిన మత్స్యకారుడు వల వేయగా.. 18 కేజీల మగ కచిడి చేప చిక్కింది.
దీనికి వేలం పాటలో 2,90,000 రూపాయల ధర పలికింది. ఇది చాలా పెద్ద మొత్తం. దాదాపు మాములు చేపలు 5, 6 నెలలు అమ్మితే వచ్చే అమౌంట్. దీంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా మగ కచిడి చేప ఉదరభాగంలో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. ఇలాంటి చేపలు ఏడాదికి 4 పడ్డా, జాలర్ల పంట పండినట్లే అని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ కచిడి చేపను గోల్డెన్ ఫిష్గా అని కూడా అంటారు. దీని విలువ ఎక్కువగా ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఆపరేషన్ అనంతరం వైద్యులు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ శరీరంలో కలిసిపోతుంది. పులస లేదా కచిడి వంటి చేపలు దొరికితే రైతులకు పండగే. ఇవే అత్యధిక ధరను కలిగి ఉంటాయి. పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలంటారని మీకూ తెలిసే ఉంటుంది. ఆ చేప టేస్ట్ అలాంటిది మరి. ఇక కచిడి ఏమో మెడిసిన్ కోసం వాడతారు. గోదావరి తీర ప్రాంతాల్లో దొరికే చేపల్లో వీటికే ఖరీదు ఎక్కువ.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…