Akhanda : ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ కామన్ కానీ సీనియర్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ మధ్య పోటీ అంటే ఆ మజాయే వేరు. తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్గా గాడ్ ఫాదర్ వచ్చింది. ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ సినిమా వసూళ్లు కొంత డౌన్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి లూసిఫర్ ను బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ అఖండ సినిమాతో పోల్చి చూస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు, అఖండ ఫస్ట్ వీక్ రికార్డును టచ్ చేయలేకపోయింది.
గాడ్ ఫాదర్ ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో రూ. 40 కోట్లు రాబట్టింది. కర్ణాటకలో రూ. 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్లో రూ. 4.75 కోట్లు రాబట్టింది. ఓవరాల్గా 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 96 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రు. 53 కోట్ల షేర్ కొల్లగొట్టింది. అయితే గాడ్ ఫాదర్ కు ఏపీ, తెలంగాణలో ఏడో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. కేవలం రూ. 83 లక్షల షేర్ మాత్రమే వసూలు అయింది. అదే బాలయ్య నటించిన అఖండ సినిమా ఏకంగా తొలి 11 రోజులు వరుసగా కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ రాబట్టింది. గాడ్ ఫాదర్ మాత్రం ఈ రికార్డు విషయంలో కేవలం 6 రోజులకే పరిమితం అయింది.
ఇక గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రోజుల్లో రూ. 53 కోట్ల షేర్ రాబడితే, అఖండ రూ. 55 కోట్ల షేర్ రాబట్టింది. ఈ విధంగా ఇద్దరూ స్టార్ హీరోల రికార్డులను పోల్చి చూస్తూ చిరు బాలయ్యను టచ్ చేయలేకపోయాడు.. బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు అంటూ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ 2 సినిమాల్లో ఎవరు రికార్డులను ఎవరు కొల్లగొడతారో చూడాలి.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…